ETV Bharat / state

'అప్రమత్తతతోనే మహమ్మారి కట్టడి సాధ్యం'

author img

By

Published : May 3, 2021, 1:43 PM IST

ప్రజలంతా అప్రమత్తంగా ఉండి కరోనా వ్యాప్తి చెందకుండా కట్టడి చేయాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పృద్ధ్వీరాజ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మారేపల్లిలో రైతులకు మాస్కులు, శానిటైజర్లు అందజేశారు.

mask distribution, mask distribution in sangareddy, mask distribution in sangareddy district
సంగారెడ్డి జిల్లా వార్తలు, సంగారెడ్డి జిల్లాలో మాస్కుల పంపిణీ, సంగారెడ్డి జిల్లాలో కరోనా కేసులు

సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మారేపల్లి గ్రామంలో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పృద్ధ్వీరాజ్ ఆధ్వర్యంలో మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ప్రతి మండలానికి ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసుకుని రైతులకు మాస్కులు, శానిటైజర్లు అందజేశారు.

ప్రజలంతా కరోనా నుంచి అప్రమత్తంగా ఉండాలని పృద్ధ్వీరాజ్ సూచించారు. అందరికి అన్నం పెట్టే రైతులు మహమ్మారి బారిన పడొద్దని కోరారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మారేపల్లి గ్రామంలో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పృద్ధ్వీరాజ్ ఆధ్వర్యంలో మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ప్రతి మండలానికి ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసుకుని రైతులకు మాస్కులు, శానిటైజర్లు అందజేశారు.

ప్రజలంతా కరోనా నుంచి అప్రమత్తంగా ఉండాలని పృద్ధ్వీరాజ్ సూచించారు. అందరికి అన్నం పెట్టే రైతులు మహమ్మారి బారిన పడొద్దని కోరారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.