ETV Bharat / state

'సభ్యత్వ నమోదు ఓ యజ్ఞంలా చేయండి'

author img

By

Published : Feb 14, 2021, 12:41 AM IST

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో.. తెరాస సభ్యత్వ కార్యక్రమానికి మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. కార్యకర్తలకు సభ్యత్వం అందించారు.

Medak MP Prabhakar Reddy attended the Teresa membership function at Patan Cheru in Sangareddy district
'సభ్యత్వ నమోదు ఓ యజ్ఞంలా చేయండి'

జాతీయ పార్టీలు చేసే దాని కంటే చెప్పేది ఎక్కువ ఉంటుందని మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గ తెరాస కార్యకర్తల సభ్యత్వ నమోదు శిబిరానికి హాజరై సభ్యత్యం అందించారు.

జీఎంఆర్ కన్వెన్షన్ కేంద్రంలో నిర్వహించిన ఈ అవగాహన శిబిరంలో.. జాతీయ పార్టీలకు ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు పుట్టించి చెప్పడం తప్ప ప్రత్యేక అజెండా లేదని ఎద్దేవా చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పటాన్ చెరు నుంచి ఎక్కువ సభ్యత్వాలు నమోదు అవుతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తెరాస కార్యకర్తలు సభ్యత్వ నమోదుని ఒక యజ్ఞంలా చేయాలని ఆయన సూచించారు.

జాతీయ పార్టీలు చేసే దాని కంటే చెప్పేది ఎక్కువ ఉంటుందని మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గ తెరాస కార్యకర్తల సభ్యత్వ నమోదు శిబిరానికి హాజరై సభ్యత్యం అందించారు.

జీఎంఆర్ కన్వెన్షన్ కేంద్రంలో నిర్వహించిన ఈ అవగాహన శిబిరంలో.. జాతీయ పార్టీలకు ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు పుట్టించి చెప్పడం తప్ప ప్రత్యేక అజెండా లేదని ఎద్దేవా చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పటాన్ చెరు నుంచి ఎక్కువ సభ్యత్వాలు నమోదు అవుతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తెరాస కార్యకర్తలు సభ్యత్వ నమోదుని ఒక యజ్ఞంలా చేయాలని ఆయన సూచించారు.

ఇదీ చదవండి:రైల్​ రోకోపై నరేశ్​ టికాయిత్​ అభ్యంతరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.