ETV Bharat / international

హెజ్​బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం - సంధికి సిద్ధమంటూనే! - ISRAEL BOMBARDS CENTRAL BEIRUT

ఓ వైపు సంధికి సిద్ధం అంటూనే - మరోవైపు లెబనాన్​పై భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్​ - ఇంతకీ కాల్పుల విరమణ సాధ్యం అవుతుందా?

Israel bombards central Beirut
Israel bombards central Beirut (AP)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 26, 2024, 10:05 PM IST

Israel Bombards Central Beirut : హెజ్‌బొల్లాతో ఓ వైపు సంధికి సిద్ధమంటోన్న ఇజ్రాయెల్‌, మరోవైపు లెబనాన్​లోని వారి స్థావరాలపై విరుచుకుపడుతోంది. మరికొన్ని గంటల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్‌ ఆమోదం తెలుపనున్న సమయంలోనే, సెంట్రల్​ బీరుట్‌పై బాంబుల వర్షం కురిపించింది. అయితే దాడులు మొదలుపెట్టక ముందు, అక్కడి భవనాలను ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఇజ్రాయెల్ చేసిన ఈ తాజా వైమానిక దాడుల్లో ఎంత మంది మరణించారనే విషయం తెలియరాలేదు. కానీ హెజ్‌బొల్లా స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నామని ఐడీఎఫ్‌ వెల్లడించింది.

సీజ్​ఫైర్​ను నెతన్యాహు ఆమోదిస్తారా?
హెజ్‌బొల్లాతో కాల్పుల విరమణకు సూత్రప్రాయ ఆమోదం తెలిపిన ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు, భద్రతా కేబినెట్‌ సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. ఈ సమావేశంలోనే కాల్పుల విరమణ ఒప్పందానికి ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. ఈ ఒప్పందానికి హెజ్‌బొల్లా కూడా అంగీకరించినట్లు లెబనాన్‌ అధికారులు వెల్లడించారు. ఒకవేళ ఇది ఇరువైపులా ఆమోదం పొందితే, ఇజ్రాయెల్‌-హెజ్‌బొల్లా మధ్య కొనసాగుతోన్న యుద్ధం ముగింపునకు కీలక ముందడుగు పడినట్లేనని భావిస్తున్నారు.

Israel Bombards Central Beirut : హెజ్‌బొల్లాతో ఓ వైపు సంధికి సిద్ధమంటోన్న ఇజ్రాయెల్‌, మరోవైపు లెబనాన్​లోని వారి స్థావరాలపై విరుచుకుపడుతోంది. మరికొన్ని గంటల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్‌ ఆమోదం తెలుపనున్న సమయంలోనే, సెంట్రల్​ బీరుట్‌పై బాంబుల వర్షం కురిపించింది. అయితే దాడులు మొదలుపెట్టక ముందు, అక్కడి భవనాలను ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఇజ్రాయెల్ చేసిన ఈ తాజా వైమానిక దాడుల్లో ఎంత మంది మరణించారనే విషయం తెలియరాలేదు. కానీ హెజ్‌బొల్లా స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నామని ఐడీఎఫ్‌ వెల్లడించింది.

సీజ్​ఫైర్​ను నెతన్యాహు ఆమోదిస్తారా?
హెజ్‌బొల్లాతో కాల్పుల విరమణకు సూత్రప్రాయ ఆమోదం తెలిపిన ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు, భద్రతా కేబినెట్‌ సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. ఈ సమావేశంలోనే కాల్పుల విరమణ ఒప్పందానికి ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. ఈ ఒప్పందానికి హెజ్‌బొల్లా కూడా అంగీకరించినట్లు లెబనాన్‌ అధికారులు వెల్లడించారు. ఒకవేళ ఇది ఇరువైపులా ఆమోదం పొందితే, ఇజ్రాయెల్‌-హెజ్‌బొల్లా మధ్య కొనసాగుతోన్న యుద్ధం ముగింపునకు కీలక ముందడుగు పడినట్లేనని భావిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.