ETV Bharat / state

శైవక్షేత్రాల్లో కార్తీక సోమవారం సందడి

author img

By

Published : Nov 23, 2020, 10:28 AM IST

Updated : Nov 23, 2020, 2:14 PM IST

కార్తీక మాసం రెండో సోమవారాన్ని పురస్కరించుకొని పటాన్​చెరులోని శివాలయాల్లో ప్రత్యేక పూజల జరిపారు. అర్చనలు, అభిషేకాలు, దీపారాధనలతో ఆలయాలు శోభను సంతరించుకున్నాయి. వేకువ జాము నుంచే భక్తుల సందడి మొదలైంది.

karthika-masam-special-puja-at-patancheru-shiva-temple-in-sangareddy
శైవక్షేత్రాల్లో కార్తీక సోమవారం సందడి

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులోని శివాలయాలు కార్తీక శోభను సంతరించుకున్నాయి. కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని అర్చకులు ప్రత్యేక పూజలు జరిపారు. సోమవారం ఉదయం నుంచే స్వామివారికి అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. స్థానిక ఉమామహేశ్వర ఆలయంలో శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన బిల్వం, ఏకబిల్వం, అఖండ దళంతో అలంకరించి... అభిషేకాలు చేశారు.

ఆలయ ఆవరణలోని మహిళలు కార్తీక దీపాలను వెలిగించారు. స్వామి వారికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు.

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులోని శివాలయాలు కార్తీక శోభను సంతరించుకున్నాయి. కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని అర్చకులు ప్రత్యేక పూజలు జరిపారు. సోమవారం ఉదయం నుంచే స్వామివారికి అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. స్థానిక ఉమామహేశ్వర ఆలయంలో శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన బిల్వం, ఏకబిల్వం, అఖండ దళంతో అలంకరించి... అభిషేకాలు చేశారు.

ఆలయ ఆవరణలోని మహిళలు కార్తీక దీపాలను వెలిగించారు. స్వామి వారికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు.

ఇదీ చదవండి: నాల్గో రోజు వైభవంగా తుంగభద్ర పుష్కరాలు

Last Updated : Nov 23, 2020, 2:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.