గ్రామాల్లో పని భారం ఎక్కువవుతోందని, తమకు ఒక సహాయకున్ని నియమించాలని... సంగారెడ్డి జిల్లా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు అన్నారు. కొండాపూర్ మండలం మల్కాపూర్లో జేపీఎస్ల జిల్లా స్థాయి సమావేశం నిర్వహించి సమస్యలపై చర్చించారు. ప్రొబేషన్ కాలాన్ని 2 సంవత్సరాలకు తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వమే ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.
కార్యదర్శులపై తోసివేయడం అన్యాయం...
ప్రస్తుతం మహిళా కార్యదర్శులకు ఉన్న నాలుగు నెలల ప్రసూతి సెలవులను 6 నెలలకు పొడిగించాలన్నారు. పని వేళల్లో వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఏ పని జరగకపోయినా పంచాయతీ కార్యదర్శులపై తోసివేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. తమ తప్పుంటే ఎలాంటి చర్యలు తీసుకున్నా అంగీకరిస్తామని చెప్పారు. సీనియర్ అసిస్టెంట్లకు ఇచ్చే వేతనం తమకు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: సేంద్రియ సాగు: పెట్టుబడి కొంచెం.. లాభాలు ఘనం