ETV Bharat / state

బీహెచ్​ఈఎల్​ పరిశ్రమలో గుండెపోటుతో కాంట్రాక్టు కార్మికుడు మృతి - సంగారెడ్డి జిల్లా తాజా వార్తలు

సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం బీహెచ్ఈఎల్ పరిశ్రమలో కాంట్రాక్టు కార్మికుడు మృతి చెందాడు. విధుల్లో ఉండగా గుండెపోటుతో హాఠాన్మరణం చెందాడు.

బీహెచ్​ఈఎల్​ పరిశ్రమలో గుండెపోటుతో కాంట్రాక్టు కార్మికుడు మృతి
బీహెచ్​ఈఎల్​ పరిశ్రమలో గుండెపోటుతో కాంట్రాక్టు కార్మికుడు మృతి
author img

By

Published : Aug 13, 2020, 4:01 AM IST

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని బీహెచ్​ఈల్​ పరిశ్రమలో విషాదం జరిగింది. కాంట్రాక్టు కార్మికుడు శ్రీనివాస్​ గుండెపోటుతో మృతి చెందాడు. సింగూరుకు చెందిన శ్రీనివాస్​ సుమారు 13ఏళ్లుగా కాంట్రాక్టు కార్మికుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు.

రోజుమాదిరిగానే బుధవారం విధులకు హాజరైన శ్రీనివాస్​ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించినప్పటికి అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధరించారు. కార్మికుడి మృతిపై యాజమాన్యం స్పందించక పోవడం వల్ల కార్మిక సంఘ నాయకులు, ఉద్యోగుల సహకారంతో 3 లక్షల రూపాయలు నష్టపరిహారం అందజేస్తామని... మృతుని భార్యకు ఔట్ సోర్సింగ్​ ఉద్యోగం ఇప్పించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు.

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని బీహెచ్​ఈల్​ పరిశ్రమలో విషాదం జరిగింది. కాంట్రాక్టు కార్మికుడు శ్రీనివాస్​ గుండెపోటుతో మృతి చెందాడు. సింగూరుకు చెందిన శ్రీనివాస్​ సుమారు 13ఏళ్లుగా కాంట్రాక్టు కార్మికుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు.

రోజుమాదిరిగానే బుధవారం విధులకు హాజరైన శ్రీనివాస్​ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించినప్పటికి అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధరించారు. కార్మికుడి మృతిపై యాజమాన్యం స్పందించక పోవడం వల్ల కార్మిక సంఘ నాయకులు, ఉద్యోగుల సహకారంతో 3 లక్షల రూపాయలు నష్టపరిహారం అందజేస్తామని... మృతుని భార్యకు ఔట్ సోర్సింగ్​ ఉద్యోగం ఇప్పించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: ఆహారశుద్ధి పరిశ్రమలను ప్రోత్సహిస్తే రైతులకు మేలు : కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.