సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని బీహెచ్ఈల్ పరిశ్రమలో విషాదం జరిగింది. కాంట్రాక్టు కార్మికుడు శ్రీనివాస్ గుండెపోటుతో మృతి చెందాడు. సింగూరుకు చెందిన శ్రీనివాస్ సుమారు 13ఏళ్లుగా కాంట్రాక్టు కార్మికుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు.
రోజుమాదిరిగానే బుధవారం విధులకు హాజరైన శ్రీనివాస్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించినప్పటికి అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధరించారు. కార్మికుడి మృతిపై యాజమాన్యం స్పందించక పోవడం వల్ల కార్మిక సంఘ నాయకులు, ఉద్యోగుల సహకారంతో 3 లక్షల రూపాయలు నష్టపరిహారం అందజేస్తామని... మృతుని భార్యకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: ఆహారశుద్ధి పరిశ్రమలను ప్రోత్సహిస్తే రైతులకు మేలు : కేటీఆర్