సంగారెడ్డి జిల్లా కంది మండలం చేర్యాలలో నీటి ఎద్దడి తొలగించాలని గ్రామ పంచాయతీ ముందు గ్రామస్థులు ధర్నా చేశారు. గ్రామంలోని 7వ వార్డులో.. 3 నెలలుగా నీటి ఇబ్బంది ఉందని ఎంత చెప్పినా.. అధికారులు రేపు మాపు అంటూ కాలం వెల్లదీస్తున్నారని గ్రామస్థులు వాపోయారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వారికి నచ్చజెప్పి నీటి ట్యాంకర్ను ఏర్పాటు చేశారు. వార్డులో 130 మీటర్ల మేర పైపులైను వేయిస్తామని.. వీలైనంత త్వరలో నీటి ఎద్దడి తీరుస్తామని పేర్కొన్నారు. అప్పటి వరకు రోజూ నీటి ట్యాంకర్ను పంపుతామని అధికారులు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: కరోనాపై 85ఏళ్ల బామ్మ విజయం