ETV Bharat / state

నకిలీతో తస్మాత్​ జాగ్రత! : ఎమ్మెల్యే - నకిలీ ఎరువులను కొని మోసపోవద్దు

ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ కోసం రైతులు నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు కొని మోసపోవద్దని ఆందోల్​ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్​ సూచించారు. నకిలీలను గుర్తిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

Andol MLA Kranti Kiran has advised farmers not to buy fake seeds, fertilizers and pesticides for the Kharif season.
నకిలీ ఎరువులను కొని మోసపోవద్దు: ఎమ్మెల్యే
author img

By

Published : May 16, 2020, 4:03 PM IST

సంగారెడ్డి జిల్లా ఆందోల్​​ మండలం జోగిపేటలోని మన గ్రోమోర్ కేంద్రంలో సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలను ఎమ్మెల్యే క్రాంతి కిరణ్​ పంపిణీ చేశారు. నకిలీ విత్తనాలు, ఎరువులను కొని మోసపోవద్దని ఈ సందర్భంగా సూచించారు. అనంతరం మన గ్రోమోర్ కేంద్రంలో ఆయన కలియతిరిగారు.

అక్కడ విక్రయిస్తున్న ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ పరికరాలను పరిశీలించారు. వాటి ధరలు, నాణ్యత తదితర అంశాలను కేంద్రం నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీఛైర్​పర్సన్​ మంజు శ్రీ, ఎంపీపీ బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

సంగారెడ్డి జిల్లా ఆందోల్​​ మండలం జోగిపేటలోని మన గ్రోమోర్ కేంద్రంలో సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలను ఎమ్మెల్యే క్రాంతి కిరణ్​ పంపిణీ చేశారు. నకిలీ విత్తనాలు, ఎరువులను కొని మోసపోవద్దని ఈ సందర్భంగా సూచించారు. అనంతరం మన గ్రోమోర్ కేంద్రంలో ఆయన కలియతిరిగారు.

అక్కడ విక్రయిస్తున్న ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ పరికరాలను పరిశీలించారు. వాటి ధరలు, నాణ్యత తదితర అంశాలను కేంద్రం నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీఛైర్​పర్సన్​ మంజు శ్రీ, ఎంపీపీ బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.