ETV Bharat / state

'సారూ మాకు కరోనా వచ్చింది.. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించండి'

author img

By

Published : Jun 16, 2020, 1:05 PM IST

సారూ!​ మాకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.. మమ్మల్ని ఆసుపత్రిలో చేర్చుకోండి. ఇది కరోనా పాజిటివ్​ వచ్చిన ఇద్దరి దంపతుల గోడు.. తమకేమీ పట్టనట్టు చికిత్సకు తరలించకుండా రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది తీవ్ర జాప్యం ప్రదర్శించారు. బాధితులు రెండు రోజులపాటు ఫోన్లు చేస్తూ నిరీక్షించాల్సి వచ్చింది. చివరకు జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ జోక్యం చేసుకున్న తర్వాత వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

The couple who had been infected by Corona they are struggle for two days for the treatment
సారూ మాకు కరోనా వచ్చింది.. చికిత్సకు తరలించండి..

రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌ గ్రీన్‌ కాలనీకి చెందిన దంపతులు ఇటీవల మంగళ్‌హాట్‌లోని సమీప బంధువు అంత్యక్రియలకు హాజరయ్యారు. కొద్దిరోజులకు తీవ్ర జ్వరం రావడం వల్ల శుక్రవారం వారు కరోనా నిర్థారణ పరీక్షలు చేయించుకున్నారు. ఇద్దరికీ పాజిటివ్‌ ఉన్నట్లు శనివారం సాయంత్రానికి తేలింది.

వెంటనే రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు, ఇటు జీహెచ్‌ఎంసీ స్థానిక అధికారులకు దంపతులు విషయాన్ని చెప్పారు. 108 వాహనానికీ సమాచారమిచ్చారు. ఆదివారం రాత్రి వరకు ఏ ఒక్కరూ స్పందించలేదు. సోమవారం ఉదయం బల్దియా మేయర్‌ బొంతు రామ్మోహన్‌ దృష్టికి విషయం వెళ్లడం వల్ల ఆయన వెంటనే వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చారు. దీనితో రంగారెడ్డి జిల్లా అధికారులు మధ్నాహ్నం ఇద్దరినీ గాంధీ ఆసుపత్రికి తరలించారు.

తక్షణం స్పందిస్తేనే..

నగరంలో నిమ్స్‌, ఫీవర్‌ ఆసుపత్రి, కింగ్‌కోఠి, ఛాతి ఆసుపత్రుల్లో ప్రస్తుతం కరోనా నిర్థారణకు స్వాబ్‌ నమూనాలు తీసుకుంటున్నారు. ఎవరికైనా పాజిటివ్‌ తేలితే సంబంధిత విభాగాలు 108 వాహనాన్ని పంపించి గాంధీ లేదా ఇతర కొవిడ్‌ ఆసుపత్రులకు పంపించాలి. కొద్ది రోజులుగా కొవిడ్‌ రోగులను ఆసుపత్రులకు తరలించే విషయంలో కిందిస్థాయి సిబ్బంది సరైన రీతిలో స్పందించడం లేదని.. కొన్నిసార్లు 108 వాహనాలు కొన్ని గంటలపాటు రావడం లేదన్న ఫిర్యాదులు ఉన్నాయి.

ఇవీ చూడండి: రాష్ట్రంలో ఐదు వేలకు చేరువలో కరోనా కేసులు

రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌ గ్రీన్‌ కాలనీకి చెందిన దంపతులు ఇటీవల మంగళ్‌హాట్‌లోని సమీప బంధువు అంత్యక్రియలకు హాజరయ్యారు. కొద్దిరోజులకు తీవ్ర జ్వరం రావడం వల్ల శుక్రవారం వారు కరోనా నిర్థారణ పరీక్షలు చేయించుకున్నారు. ఇద్దరికీ పాజిటివ్‌ ఉన్నట్లు శనివారం సాయంత్రానికి తేలింది.

వెంటనే రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు, ఇటు జీహెచ్‌ఎంసీ స్థానిక అధికారులకు దంపతులు విషయాన్ని చెప్పారు. 108 వాహనానికీ సమాచారమిచ్చారు. ఆదివారం రాత్రి వరకు ఏ ఒక్కరూ స్పందించలేదు. సోమవారం ఉదయం బల్దియా మేయర్‌ బొంతు రామ్మోహన్‌ దృష్టికి విషయం వెళ్లడం వల్ల ఆయన వెంటనే వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చారు. దీనితో రంగారెడ్డి జిల్లా అధికారులు మధ్నాహ్నం ఇద్దరినీ గాంధీ ఆసుపత్రికి తరలించారు.

తక్షణం స్పందిస్తేనే..

నగరంలో నిమ్స్‌, ఫీవర్‌ ఆసుపత్రి, కింగ్‌కోఠి, ఛాతి ఆసుపత్రుల్లో ప్రస్తుతం కరోనా నిర్థారణకు స్వాబ్‌ నమూనాలు తీసుకుంటున్నారు. ఎవరికైనా పాజిటివ్‌ తేలితే సంబంధిత విభాగాలు 108 వాహనాన్ని పంపించి గాంధీ లేదా ఇతర కొవిడ్‌ ఆసుపత్రులకు పంపించాలి. కొద్ది రోజులుగా కొవిడ్‌ రోగులను ఆసుపత్రులకు తరలించే విషయంలో కిందిస్థాయి సిబ్బంది సరైన రీతిలో స్పందించడం లేదని.. కొన్నిసార్లు 108 వాహనాలు కొన్ని గంటలపాటు రావడం లేదన్న ఫిర్యాదులు ఉన్నాయి.

ఇవీ చూడండి: రాష్ట్రంలో ఐదు వేలకు చేరువలో కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.