ETV Bharat / state

జేఈఈ మెయిన్స్ రాస్తున్నారా? - ఈ ట్రిక్స్ పాటిస్తే మంచి మార్కులు పక్కా! - JEE MAIN EXAMS IN TELANGANA

ఈ నెల చివరిలో జేఈఈ మెయిన్స్ పరీక్ష - పరీక్షలకు ఏర్పాట్లు చేసిన ఎన్టీఏ - విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా?

Precautions to be Taken By Students Appearing for JEE Mains Exam
Precautions to be Taken By Students Appearing for JEE Mains Exam (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 21, 2025, 1:42 PM IST

Updated : Jan 21, 2025, 3:45 PM IST

Precautions to be Taken By Students Appearing for JEE Mains Exam : దేశవ్యాప్తంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించే జేఈఈ మెయిన్స్‌, బీఆర్క్‌ మొదటి విడత-2025 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జేఈఈ మెయిన్స్‌, పరీక్షలను ఈ నెల 22,23,24,28,29న, బీఆర్క్‌ పరీక్షను ఈ నెల 30న నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. సుమారు 6 వేల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. బుధవారం నుంచి పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులు పాటించాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు చూద్దాం.

జేఈఈ పరీక్ష రాస్తున్నారా? - ఐతే ఈ లేటెస్ట్ అప్డేట్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే

విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • పరీక్ష సమయం కంటే గంట ముందే కేంద్రానికి చేరుకోవాలి. ఉదయం 8.30, మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రధాన ద్వారాలు మూసేస్తారు. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ లోనికి అనుమతించరు. ఉదయం 7.30 నుంచి 8.30, మధ్యాహ్నం 1.30 నుంచి 2.30 గంటల మధ్య పరీక్షా కేంద్రాల వద్ద సిద్ధంగా ఉండాలి.
  • ఖమ్మం, భద్రాద్రి జిల్లాలకు చెందిన కొంతమంది విద్యార్థులకు హైదరాబాద్, వరంగల్‌ లాంటి నగరాల్లో పరీక్షకేంద్రాలను కేటాయించారు. ఇలాంటి విద్యార్థులు ఒకరోజు ముందే అక్కడికి చేరుకొని చిరునామాలు కనుక్కోవటం మంచిది.
  • పరీక్షకు దరఖాస్తు చేసిన తరువాత కన్ఫర్మేషన్‌ పేజీ వస్తుంది. దరఖాస్తు సమయంలో ఇచ్చిన ఫొటోలను మాత్రమే పరీక్ష రాసే సమయంలో తీసుకెళ్లాలి. లేకపోతే అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశముంటుంది.
  • ఆధార్‌/ పాస్‌పోర్ట్‌/ రేషన్‌ కార్డు లేదా ఏదైనా ప్రభుత్వ గుర్తింపు (ఐడెంటిటీ) కార్డు తీసుకెళ్లాలి.
  • రెండు పాస్‌పోర్టుసైజ్‌ ఫొటోలు, ట్రాన్స్‌పరెంట్‌ పెన్ను, అడ్మిట్‌ కార్డు, బీఆర్క్‌ పరీక్షకైతే పెన్సిల్, స్కేల్, రబ్బర్, జామెంట్రీ బాక్స్, వాటర్‌ బాటిల్‌ తీసుకెళ్లాలి.
  • సాధారణ దుస్తులు, చెప్పులు ధరించాలి.
  • మైనస్‌ మార్కులు ఉంటాయి కాబట్టి కచ్చితంగా తెలిసిన ప్రశ్నలకు మాత్రమే జవాలివ్వాలి. ఒక్క మార్కు తేడాతో జాతీయ స్థాయిలో సీటు కోల్పోయే ప్రమాదముంది. అందుకే ఈ విషయంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండి జవాబులు పెట్టాలి. ఊహించి జవాబులు పెట్టవద్దు.
  • పరీక్షకు ముందు రోజు రసాయన శాస్త్రానికి సంబంధించి రివైజ్డ్‌బేస్డ్‌ ప్రశ్నలను పునశ్చరణ చేసుకుంటే కొంతవరకు ఒత్తిడి తగ్గుతుంది.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షపై యూటర్న్‌ - మూడుసార్లు కాదు రెండుసార్లు మాత్రమే ఛాన్స్

జేఈఈ మెయిన్స్​కు ప్రిపేర్ అవుతున్నారా? ఆ విషయంలో మీకో గుడ్​ న్యూస్!

Precautions to be Taken By Students Appearing for JEE Mains Exam : దేశవ్యాప్తంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించే జేఈఈ మెయిన్స్‌, బీఆర్క్‌ మొదటి విడత-2025 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జేఈఈ మెయిన్స్‌, పరీక్షలను ఈ నెల 22,23,24,28,29న, బీఆర్క్‌ పరీక్షను ఈ నెల 30న నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. సుమారు 6 వేల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. బుధవారం నుంచి పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులు పాటించాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు చూద్దాం.

జేఈఈ పరీక్ష రాస్తున్నారా? - ఐతే ఈ లేటెస్ట్ అప్డేట్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే

విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • పరీక్ష సమయం కంటే గంట ముందే కేంద్రానికి చేరుకోవాలి. ఉదయం 8.30, మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రధాన ద్వారాలు మూసేస్తారు. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ లోనికి అనుమతించరు. ఉదయం 7.30 నుంచి 8.30, మధ్యాహ్నం 1.30 నుంచి 2.30 గంటల మధ్య పరీక్షా కేంద్రాల వద్ద సిద్ధంగా ఉండాలి.
  • ఖమ్మం, భద్రాద్రి జిల్లాలకు చెందిన కొంతమంది విద్యార్థులకు హైదరాబాద్, వరంగల్‌ లాంటి నగరాల్లో పరీక్షకేంద్రాలను కేటాయించారు. ఇలాంటి విద్యార్థులు ఒకరోజు ముందే అక్కడికి చేరుకొని చిరునామాలు కనుక్కోవటం మంచిది.
  • పరీక్షకు దరఖాస్తు చేసిన తరువాత కన్ఫర్మేషన్‌ పేజీ వస్తుంది. దరఖాస్తు సమయంలో ఇచ్చిన ఫొటోలను మాత్రమే పరీక్ష రాసే సమయంలో తీసుకెళ్లాలి. లేకపోతే అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశముంటుంది.
  • ఆధార్‌/ పాస్‌పోర్ట్‌/ రేషన్‌ కార్డు లేదా ఏదైనా ప్రభుత్వ గుర్తింపు (ఐడెంటిటీ) కార్డు తీసుకెళ్లాలి.
  • రెండు పాస్‌పోర్టుసైజ్‌ ఫొటోలు, ట్రాన్స్‌పరెంట్‌ పెన్ను, అడ్మిట్‌ కార్డు, బీఆర్క్‌ పరీక్షకైతే పెన్సిల్, స్కేల్, రబ్బర్, జామెంట్రీ బాక్స్, వాటర్‌ బాటిల్‌ తీసుకెళ్లాలి.
  • సాధారణ దుస్తులు, చెప్పులు ధరించాలి.
  • మైనస్‌ మార్కులు ఉంటాయి కాబట్టి కచ్చితంగా తెలిసిన ప్రశ్నలకు మాత్రమే జవాలివ్వాలి. ఒక్క మార్కు తేడాతో జాతీయ స్థాయిలో సీటు కోల్పోయే ప్రమాదముంది. అందుకే ఈ విషయంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండి జవాబులు పెట్టాలి. ఊహించి జవాబులు పెట్టవద్దు.
  • పరీక్షకు ముందు రోజు రసాయన శాస్త్రానికి సంబంధించి రివైజ్డ్‌బేస్డ్‌ ప్రశ్నలను పునశ్చరణ చేసుకుంటే కొంతవరకు ఒత్తిడి తగ్గుతుంది.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షపై యూటర్న్‌ - మూడుసార్లు కాదు రెండుసార్లు మాత్రమే ఛాన్స్

జేఈఈ మెయిన్స్​కు ప్రిపేర్ అవుతున్నారా? ఆ విషయంలో మీకో గుడ్​ న్యూస్!

Last Updated : Jan 21, 2025, 3:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.