ETV Bharat / state

రాజేంద్రనగర్​ అటవీ ప్రాంతంలో చిరుత?

author img

By

Published : May 15, 2020, 9:20 AM IST

Updated : May 15, 2020, 11:36 AM IST

రంగారెడ్డి జిల్లా కాటేదాన్​లో కలకలం రేపిన చిరుత ఆచూకీ కోసం అధికారులు గాలిస్తున్నారు. చిరుతను పట్టుకునేందుకు బోన్లు ఏర్పాటు చేశారు. మేకను ఎరగా వేసి చిరుతను పట్టుకునే ప్రయత్నంలో అధికారులు నిమగ్నమయ్యారు. ఒకవేళ బోన్​లో పడకుండా తప్పించుకుంటే ఎటువైపు వెళ్లే అవకాశముందో తెలుసుకోవడానికి వీలుగా కెమెరా ట్రాప్​లతో పాటు.. డ్రోన్ కెమెరాలతోనూ పర్యవేక్షిస్తున్నారు.

searching-measures-for-cheetah-in-katedan-area-are-continuing
చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు

రంగారెడ్డి కాటేదాన్‌లో కలకలం రేపిన చిరుత ఆచూకీ కోసం అధికారుల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 40 ఎకరాల ఓ వ్యవసాయ క్షేత్రంలో నక్కిన చిరుత కోసం అటవీ, పోలీసుశాఖ అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. చిరుత కోసం 4 ప్రత్యేక బృందాలతో పర్యవేక్షిస్తున్నారు. బంధించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

బోన్లు ఏర్పాటు

వ్యవసాయ పొలం పక్కనే జనావాసాలు ఉన్నందున... ఒకవేళ ఇళ్లల్లోకి వెళితే మనుషులపై దాడి చేసే ప్రమాదముందని భావిస్తున్నారు. పొదల్లో నక్కిన చిరుత... ఆహారం, నీళ్ల కోసం బయటికి రావొచ్చనే అంచనాతో బంధించేందుకు 2 బోన్లు ఏర్పాటు చేశారు. బోన్లలో మేకలను ఎరగా వేశారు. వలలు కూడా ఏర్పాటు చేశారు.

23 కెమెరా ట్రాప్​లతో గాలింపు

మహేశ్వరంలోని అటవీ ప్రాంతం నుంచి.. లేదా రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైపు ఉన్న అటవీక్షేత్రం నుంచి చిరుత వచ్చి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. వచ్చిన దారినే మళ్లీ వెళ్లే అవకాశం ఉన్నందున అటవీ అధికారులు పలుచోట్ల 23 కెమెరా ట్రాప్‌లు ఏర్పాటు చేశారు.

'చిరుత ఫాంహౌస్​లో లేదు'

ఘటనపై డీసీపీ ప్రకాశ్​రెడ్డి స్పందించారు. చిరుత ఫాంహౌస్​ దాటి వెళ్లిపోయిందని... రాజేంద్రనగర్​లోని వ్యవసాయ వర్సిటీ వైపు వెళ్లినట్లు ఆనవాళ్లు కనిపించాయన్నారు. చిరుత విషయంలో స్థానికులు భయపడవద్దని సూచించారు.

ఇవీ చూడండి: ఆ అడవి నాదే..ఈ నగరం నాదే.

రంగారెడ్డి కాటేదాన్‌లో కలకలం రేపిన చిరుత ఆచూకీ కోసం అధికారుల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 40 ఎకరాల ఓ వ్యవసాయ క్షేత్రంలో నక్కిన చిరుత కోసం అటవీ, పోలీసుశాఖ అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. చిరుత కోసం 4 ప్రత్యేక బృందాలతో పర్యవేక్షిస్తున్నారు. బంధించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

బోన్లు ఏర్పాటు

వ్యవసాయ పొలం పక్కనే జనావాసాలు ఉన్నందున... ఒకవేళ ఇళ్లల్లోకి వెళితే మనుషులపై దాడి చేసే ప్రమాదముందని భావిస్తున్నారు. పొదల్లో నక్కిన చిరుత... ఆహారం, నీళ్ల కోసం బయటికి రావొచ్చనే అంచనాతో బంధించేందుకు 2 బోన్లు ఏర్పాటు చేశారు. బోన్లలో మేకలను ఎరగా వేశారు. వలలు కూడా ఏర్పాటు చేశారు.

23 కెమెరా ట్రాప్​లతో గాలింపు

మహేశ్వరంలోని అటవీ ప్రాంతం నుంచి.. లేదా రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైపు ఉన్న అటవీక్షేత్రం నుంచి చిరుత వచ్చి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. వచ్చిన దారినే మళ్లీ వెళ్లే అవకాశం ఉన్నందున అటవీ అధికారులు పలుచోట్ల 23 కెమెరా ట్రాప్‌లు ఏర్పాటు చేశారు.

'చిరుత ఫాంహౌస్​లో లేదు'

ఘటనపై డీసీపీ ప్రకాశ్​రెడ్డి స్పందించారు. చిరుత ఫాంహౌస్​ దాటి వెళ్లిపోయిందని... రాజేంద్రనగర్​లోని వ్యవసాయ వర్సిటీ వైపు వెళ్లినట్లు ఆనవాళ్లు కనిపించాయన్నారు. చిరుత విషయంలో స్థానికులు భయపడవద్దని సూచించారు.

ఇవీ చూడండి: ఆ అడవి నాదే..ఈ నగరం నాదే.

Last Updated : May 15, 2020, 11:36 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.