కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రజలంతా సామాజిక దూరం పాటించాలని మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ ఛైర్పర్సన్ మల్రెడ్డి అనురాధతో కలిసి... మున్సిపాలిటీలోని ప్రధాన రహదారులపై సోడియం హైపోక్లోరైట్ స్ప్రే చేయించారు.
స్ప్రే కోసం రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీ రావు.. ఫిల్మ్సిటీకి చెందిన ఫైర్ఇంజిన్లు పంపించారని మల్రెడ్డి రంగారెడ్డి తెలిపారు. రామోజీ రావు చేసిన సాయం మరువలేనిదని... ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో విజృంభిస్తున్న కరోనా.. ఒక్క రోజే 75 కేసులు