ETV Bharat / state

అయిన వాళ్లు పొమ్మన్నారు... కానీ వాళ్లు ఆదరించారు - rangareddy

నిండుజీవితం ఎన్నో జ్ఞాపకాలమయం. కొన్ని మధురమైనవి.. ఇంకొన్ని భారమైనవి. సువిశాల మానవ సమాజంలో మనుషుల మధ్య సంబంధాలు కరవైపోతున్నాయి. విశాలమైన ఇళ్లలో మనసులు ఇరుకైపోతున్నవి. ధనార్జనే ధ్యేయంగా కాలంవెంట పరుగులు పెడుతూ రక్తసంబంధాలకే పాతరేస్తున్నారు నేటితరం. తమ జీవితాన్ని పిల్లలకోసం త్యాగంచేసి చరమాంకంలో వారి నుంచి ఆసరా కోసం ఎదురుచూసే తల్లిదండ్రులకు నిరాశే ఎదురవుతోంది. అలాంటి వారందరినీ అక్కున చేర్చుకుని వార్థక్యంలో తోడుగా నిలిచింది మాతాపితరుల సేవాసదనం​.

old-age-home-pkg
author img

By

Published : May 12, 2019, 7:08 PM IST

Updated : May 12, 2019, 9:24 PM IST

అయిన వాళ్లు పొమ్మన్నారు... కానీ వాళ్లు ఆదరించారు

గుండెల్లో పెట్టుకుని పెంచిన పిల్లలే బయటకి పొమ్మన్నారు. ఆదరించి పెంచిన వారిని బయటకు నెట్టేశారు. ఎంతో జీవితాన్ని చూసిన వారికి నేడు జీవనం భారమైంది. దిక్కుతోచని స్థితిలో ఆ పండుటాకులకు ఆసరాగా నిలిచింది మాతాపితరుల సేవాసదనం​. వీళ్లకు ఇప్పుడు కావాల్సింది పట్టెడన్నం, గుప్పెడు ప్రేమ, పుట్టెడు ఆదరణ. వార్థక్యంలో వ్యధలతో గడుపుతున్న వారికి అదో దేవాలయం.. స్నేహితులతో కబుర్లు చెప్పుకోడానికి అదో కళాశాల. భక్తికోసం అదో ధ్యాన మందిరం.. తమ జీవితాలతో ముడిపడిన పవిత్ర ప్రదేశం ఈ మాతాపితురులు సేవాసదనం​.

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని వినోభానగర్​లోని మాతాపితరుల సేవాసదనం​ ఆదరణ కరవైన ఎందరో వృద్ధుల పాలిట అమ్మఒడి. స్వాతంత్య్ర సమరయోధుడు బండారు చిన్న రంగారెడ్డికి ప్రభుత్వం ఐదెకరాల భూమి ఇచ్చింది. రెండెకరాల్లో మాతాపితురుల సేవాసదనం పేరుతో ఆశ్రమాన్ని ప్రారంభించాడు. తన భార్య సరోజినీదేవి స్మృత్యర్థం పౌండేషన్​ ఏర్పాటు చేసి 2005 నుంచి ఎందరికో ఆశ్రయం కల్పించాడు.

పింఛనుతోనే ఆసరా ఇస్తూ

తమకొచ్చే పింఛనుతో పాటు దాతల సహకారంతో దీనిని నడిపిస్తున్నారు ట్రస్ట్​సభ్యులు. ఆశ్రమంలో ఎవరిని చూసినా పైకి గంభీరంగానే కనబడతారు. కష్టాలు తలచుకొని బాధపడుతున్నారు. ఎవరిని పలకరించినా మౌనం... పొడిపొడి మాటలే.. ఆశలేని ఆ కళ్లమాటున కన్నీటి చారలు మన చూపును దాటిపోవు. చిన్నపిల్లలై దు:ఖంతో కన్నీటి పర్యంతమవుతారు.

ఎవరికి వారివే దీన గాథలు

ప్రకృతి ఒడిలో సేదదీరుతున్నంత ప్రశాంతంగా ఉంటోంది ఆ ఆశ్రమ ప్రాంగణం. రకరకాల పళ్లు, పూల మొక్కలు, కూరగాయలు వారే పండించుకుంటారు. ఆధ్యాత్మికతతో భజనలు, దైవ ప్రార్థనలు చేసుకుంటూ ఎక్కడెక్కడి నుంచో వచ్చినవారంతా ఓ కుటుంబమైపోయారు.

అయినవాళ్ల ఆదరణకు నోచుకోని వారందరినీ చేరదీసి నూతన జీవితాన్ని ప్రసాదించిన ఈ ఆశ్రమం వారికి ప్రాణసమానం. ఈ సేవాకార్యక్రమానికి రూపం ఇచ్చిన ఆశ్రమ నిర్వాహకులు ఎందరికో ఆదర్శం.

ఇదీ చదవండి: అమ్మ ప్రేమను అందరూ గౌరవించాల్సిందే

అయిన వాళ్లు పొమ్మన్నారు... కానీ వాళ్లు ఆదరించారు

గుండెల్లో పెట్టుకుని పెంచిన పిల్లలే బయటకి పొమ్మన్నారు. ఆదరించి పెంచిన వారిని బయటకు నెట్టేశారు. ఎంతో జీవితాన్ని చూసిన వారికి నేడు జీవనం భారమైంది. దిక్కుతోచని స్థితిలో ఆ పండుటాకులకు ఆసరాగా నిలిచింది మాతాపితరుల సేవాసదనం​. వీళ్లకు ఇప్పుడు కావాల్సింది పట్టెడన్నం, గుప్పెడు ప్రేమ, పుట్టెడు ఆదరణ. వార్థక్యంలో వ్యధలతో గడుపుతున్న వారికి అదో దేవాలయం.. స్నేహితులతో కబుర్లు చెప్పుకోడానికి అదో కళాశాల. భక్తికోసం అదో ధ్యాన మందిరం.. తమ జీవితాలతో ముడిపడిన పవిత్ర ప్రదేశం ఈ మాతాపితురులు సేవాసదనం​.

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని వినోభానగర్​లోని మాతాపితరుల సేవాసదనం​ ఆదరణ కరవైన ఎందరో వృద్ధుల పాలిట అమ్మఒడి. స్వాతంత్య్ర సమరయోధుడు బండారు చిన్న రంగారెడ్డికి ప్రభుత్వం ఐదెకరాల భూమి ఇచ్చింది. రెండెకరాల్లో మాతాపితురుల సేవాసదనం పేరుతో ఆశ్రమాన్ని ప్రారంభించాడు. తన భార్య సరోజినీదేవి స్మృత్యర్థం పౌండేషన్​ ఏర్పాటు చేసి 2005 నుంచి ఎందరికో ఆశ్రయం కల్పించాడు.

పింఛనుతోనే ఆసరా ఇస్తూ

తమకొచ్చే పింఛనుతో పాటు దాతల సహకారంతో దీనిని నడిపిస్తున్నారు ట్రస్ట్​సభ్యులు. ఆశ్రమంలో ఎవరిని చూసినా పైకి గంభీరంగానే కనబడతారు. కష్టాలు తలచుకొని బాధపడుతున్నారు. ఎవరిని పలకరించినా మౌనం... పొడిపొడి మాటలే.. ఆశలేని ఆ కళ్లమాటున కన్నీటి చారలు మన చూపును దాటిపోవు. చిన్నపిల్లలై దు:ఖంతో కన్నీటి పర్యంతమవుతారు.

ఎవరికి వారివే దీన గాథలు

ప్రకృతి ఒడిలో సేదదీరుతున్నంత ప్రశాంతంగా ఉంటోంది ఆ ఆశ్రమ ప్రాంగణం. రకరకాల పళ్లు, పూల మొక్కలు, కూరగాయలు వారే పండించుకుంటారు. ఆధ్యాత్మికతతో భజనలు, దైవ ప్రార్థనలు చేసుకుంటూ ఎక్కడెక్కడి నుంచో వచ్చినవారంతా ఓ కుటుంబమైపోయారు.

అయినవాళ్ల ఆదరణకు నోచుకోని వారందరినీ చేరదీసి నూతన జీవితాన్ని ప్రసాదించిన ఈ ఆశ్రమం వారికి ప్రాణసమానం. ఈ సేవాకార్యక్రమానికి రూపం ఇచ్చిన ఆశ్రమ నిర్వాహకులు ఎందరికో ఆదర్శం.

ఇదీ చదవండి: అమ్మ ప్రేమను అందరూ గౌరవించాల్సిందే

Intro:TG_KRN_101_12_MLA_PARISHATH ENNIKALA_PRACHARAM_AVB_C11
FROM:KAMALAKAR 9441842417
---------------------------------------------------------------------------- చివరి విడత ప్రాదేశిక ఎన్నికల ప్రచారానికి నేడు చివరిరోజు కావడంతో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల్లో హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ పార్టీ ఎంపీటీసీ జడ్పిటిసి అభ్యర్థులకు మద్దతుగా సుడిగాలి ప్రచారం నిర్వహించారు. హుస్నాబాద్ మండలం లోని 6 ఎంపిటిసి స్థానాలకు, 1 జెడ్పిటిసి స్థానానికి మరియు
అక్కన్న పేట మండలంలోని 12 ఎంపీ స్థానాలకు, 1 జడ్పిటిసి స్థానానికి తెరాస తరుపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గ్రామాలలోని ప్రజలను ఎమ్మెల్యే సతీష్ కుమార్ కోరారు. ఎల్లుండి మే 14వ తేదీన జరిగే ఎన్నికల్లో గ్రామాలలో ఎంపీటీసీ జడ్పిటిసి అభ్యర్థులుగా పోటీ చేస్తున్న తెరాస అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాలలో జరగాల్సిన పనులు వేగవంతంగా జరుగుతాయని అదేవిధంగా వచ్చే నెల ఒకటో తేదీ నుంచి వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు రెట్టింపు కానున్నాయని, నిరుద్యోగులకు కూడా వచ్చేనెల నుంచి 3 వేల రూపాయల పింఛన్లు ఇవ్వబోతున్నామని, కాళేశ్వరం నీళ్ళు కూడా అతి త్వరలో గౌరవెల్లి ప్రాజెక్టులోకి రాబోతున్నాయని ప్రాజెక్టులోకి నీరు చేరడంతో హుస్నాబాద్ నియోజకవర్గం అంతా సస్యశ్యామలం అవుతుందని అన్నారు. ఇంకా అభివృద్ధి వేగవంతంగా జరగాలంటే కారు గుర్తుకు ఓటు వేసి తెరాస ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే సతీష్ కుమార్ కోరారు. ఈ ప్రచార కార్యక్రమలలో ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారితో పాటు కరీంనగర్ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ గారు కూడా పాల్గొన్నారు.


Body:సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ అక్కన్నపేట మండలాల్లో


Conclusion:ఎమ్మెల్యే సతీష్ కుమార్ సుడిగాలి ప్రాదేశిక ఎన్నికల ప్రచారం
Last Updated : May 12, 2019, 9:24 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.