ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా.. ప్రజల బాగు కోసమేనని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పేర్కొన్నారు. కరోనా వైరస్ మహమ్మారి నుంచి ప్రజలను కాపాడుకునేందుకే లాక్డౌన్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఎమ్మెల్యే పర్యటించారు.
ఈ సందర్భంగా హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై పోలీసులు ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ వద్ద ప్రజలకు మాస్కులు పంపిణీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించి.. కరోనాను అరికడదామని తెలిపారు.
ఇవీచూడండి: కరోనాపై యుద్ధం... రంగంలోకి మంత్రి కేటీఆర్