ETV Bharat / state

పల్లెల అభివృద్ధికే తొలి ప్రాధాన్యం: మంత్రి సబిత

author img

By

Published : Jan 19, 2021, 9:03 AM IST

గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్... రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కోళ్ల పడకల్ గ్రామంలో పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Minister Sabita Indrareddy visited Kolla Padakal village in Maheshwaram zone of Rangareddy district as part of a rural sleep program.
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని ముందుకు తీసుపోతున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కోళ్ల పడకల్ గ్రామంలో పర్యటించారు. కాలనీల్లో నడుచుకుంటూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయా లేదా అనే విషయాన్ని స్థానికులను అడిగి తెలుసుకున్నారు.

పట్టణాలు, గ్రామాలు రెండు కళ్లుగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతో... దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమం తీసుకువచ్చిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. పల్లెల అభివృద్ధి కోసం ప్రతి నెల రూ. 339 కోట్లు విడుదల చేస్తున్నామని తెలిపారు. గ్రామపంచాయతీకి అనుబంధంగా ఉన్న తండాలను నూతన పంచాయతీలుగా మార్చామని పేర్కొన్నారు.

పల్లెప్రగతిలో భాగంగా గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారానే విషయాలు... సంక్షేమ పథకాలను ఎలా అమలుచేస్తున్నారనే విషయాన్ని తెలుకోవడం కోసం ఈ పల్లె నిద్ర కార్యక్రమం అని మంత్రి అన్నారు.

ఇదీ చదవండి: 'ధరణిలో మార్పులు చేర్పుల ప్రక్రియ కొనసాగుతోంది'

గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని ముందుకు తీసుపోతున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కోళ్ల పడకల్ గ్రామంలో పర్యటించారు. కాలనీల్లో నడుచుకుంటూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయా లేదా అనే విషయాన్ని స్థానికులను అడిగి తెలుసుకున్నారు.

పట్టణాలు, గ్రామాలు రెండు కళ్లుగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతో... దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమం తీసుకువచ్చిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. పల్లెల అభివృద్ధి కోసం ప్రతి నెల రూ. 339 కోట్లు విడుదల చేస్తున్నామని తెలిపారు. గ్రామపంచాయతీకి అనుబంధంగా ఉన్న తండాలను నూతన పంచాయతీలుగా మార్చామని పేర్కొన్నారు.

పల్లెప్రగతిలో భాగంగా గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారానే విషయాలు... సంక్షేమ పథకాలను ఎలా అమలుచేస్తున్నారనే విషయాన్ని తెలుకోవడం కోసం ఈ పల్లె నిద్ర కార్యక్రమం అని మంత్రి అన్నారు.

ఇదీ చదవండి: 'ధరణిలో మార్పులు చేర్పుల ప్రక్రియ కొనసాగుతోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.