ETV Bharat / state

కేటీఆర్​కు ఎన్‌జీటీ ఇచ్చిన నోటీసులపై హైకోర్టు స్టే

author img

By

Published : Jun 10, 2020, 1:53 PM IST

Updated : Jun 10, 2020, 2:16 PM IST

ktr
ktr

13:52 June 10

కేటీఆర్​కు ఎన్‌జీటీ ఇచ్చిన నోటీసులపై హైకోర్టు స్టే

రంగారెడ్డి జిల్లా జన్వాడలోని ఫాంహౌస్‌కు సంబంధించి... జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే ఇచ్చింది. జన్వాడలోని 301 నుంచి 313 వరకు ఉన్న సర్వే నంబర్ల పరిధిలో ఉన్న ఫాంహౌస్‌ విస్తరణ సక్రమమో కాదో తేల్చేందుకు... జాతీయ హరిత ట్రైబ్యునల్ నిజనిర్ధరణ కమిటీ వేసింది.  

జీవో 111ను ఉల్లంఘిస్తూ...  ఫాం హౌస్‌ను విస్తరించారంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ట్రైబ్యునల్... ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. 2 నెలల్లో నిజనిర్ధరణ కమిటీ నివేదిక ఇవ్వాలని తెలిపింది. ప్రతివాదులైన మంత్రి కేటీఆర్ సహా పలువురికి నోటీసులు జారీ చేసింది. ఈ విషయంపై ఎన్జీటీ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టులో మంత్రి కేటీఆర్​ సవాల్‌ చేయగా... అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. 

13:52 June 10

కేటీఆర్​కు ఎన్‌జీటీ ఇచ్చిన నోటీసులపై హైకోర్టు స్టే

రంగారెడ్డి జిల్లా జన్వాడలోని ఫాంహౌస్‌కు సంబంధించి... జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే ఇచ్చింది. జన్వాడలోని 301 నుంచి 313 వరకు ఉన్న సర్వే నంబర్ల పరిధిలో ఉన్న ఫాంహౌస్‌ విస్తరణ సక్రమమో కాదో తేల్చేందుకు... జాతీయ హరిత ట్రైబ్యునల్ నిజనిర్ధరణ కమిటీ వేసింది.  

జీవో 111ను ఉల్లంఘిస్తూ...  ఫాం హౌస్‌ను విస్తరించారంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ట్రైబ్యునల్... ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. 2 నెలల్లో నిజనిర్ధరణ కమిటీ నివేదిక ఇవ్వాలని తెలిపింది. ప్రతివాదులైన మంత్రి కేటీఆర్ సహా పలువురికి నోటీసులు జారీ చేసింది. ఈ విషయంపై ఎన్జీటీ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టులో మంత్రి కేటీఆర్​ సవాల్‌ చేయగా... అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. 

Last Updated : Jun 10, 2020, 2:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.