ETV Bharat / state

కేసీఆర్​ లాంటి ముఖ్యమంత్రి ఉండటం మన అదృష్టం: ఎర్రబెల్లి

author img

By

Published : Nov 24, 2020, 3:55 PM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మీర్​పేట్​ హౌసింగ్​ బోర్డు డివిజన్​లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు ప్రచారం నిర్వహించారు. అభ్యర్థి ప్రభుదాస్​తో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు.

minister errabelli campaign in meerpet
కేసీఆర్​ లాంటి ముఖ్యమంత్రి ఉండటం మన అదృష్టం: ఎర్రబెల్లి

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మీర్​పేట్​ హౌసింగ్ బోర్డు డివిజన్​లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పూలు అమ్మి ప్రచారం నిర్వహించారు. అభ్యర్థి ప్రభుదాస్​తో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ప్రచారంలో పాల్గొన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి అభ్యర్థిని గెలిపించాలని కోరారు.

కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి ఉండడం మన అదృష్టమని, ప్రజల కష్టాలు తెలుసు కాబట్టే సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని ఎర్రబెల్లి అన్నారు. కేసీఆర్ ప్రకటించిన కొత్త పథకాలు ప్రజలకు మేలు చేస్తాయని భావించారు. డిసెంబర్ నుంచి జీహెచ్ఎంసీ ప్రజలందరికీ నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచిత మంచినీటి సరఫరా చేస్తామని తెలిపారు.

కేసీఆర్​ లాంటి ముఖ్యమంత్రి ఉండటం మన అదృష్టం: ఎర్రబెల్లి

దేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణని రెండో స్థానంలో నిలబెడతామన్నారు. హైదరాబాద్​లో ప్రశాంత వాతావరణం ఉన్నందునే రూ. లక్షల కోట్ల పెట్టబడులు నగరానికి వస్తున్నాయని స్పష్టం చేశారు. గ్రేటర్​ని మరింతగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.

ఇదీ చదవండి: రాంగోపాల్​పేటలో తెరాస చేసిన అభివృద్ధి శూన్యం: శీలం ప్రభాకర్

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మీర్​పేట్​ హౌసింగ్ బోర్డు డివిజన్​లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పూలు అమ్మి ప్రచారం నిర్వహించారు. అభ్యర్థి ప్రభుదాస్​తో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ప్రచారంలో పాల్గొన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి అభ్యర్థిని గెలిపించాలని కోరారు.

కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి ఉండడం మన అదృష్టమని, ప్రజల కష్టాలు తెలుసు కాబట్టే సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని ఎర్రబెల్లి అన్నారు. కేసీఆర్ ప్రకటించిన కొత్త పథకాలు ప్రజలకు మేలు చేస్తాయని భావించారు. డిసెంబర్ నుంచి జీహెచ్ఎంసీ ప్రజలందరికీ నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచిత మంచినీటి సరఫరా చేస్తామని తెలిపారు.

కేసీఆర్​ లాంటి ముఖ్యమంత్రి ఉండటం మన అదృష్టం: ఎర్రబెల్లి

దేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణని రెండో స్థానంలో నిలబెడతామన్నారు. హైదరాబాద్​లో ప్రశాంత వాతావరణం ఉన్నందునే రూ. లక్షల కోట్ల పెట్టబడులు నగరానికి వస్తున్నాయని స్పష్టం చేశారు. గ్రేటర్​ని మరింతగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.

ఇదీ చదవండి: రాంగోపాల్​పేటలో తెరాస చేసిన అభివృద్ధి శూన్యం: శీలం ప్రభాకర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.