రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని బాలాపూర్ రాయల్కాలనీ మూడో వార్డులో ఎంఐఎం పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా ఔరంగబాద్ ఎంపీ ఇంతియాజ్ జలీల్ హాజరయ్యారు. ఎంఐఎం పార్టీ తరుఫున బరిలో ఉన్న అభ్యర్థులందరిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
ఎంఐఎం పార్టీ ఎల్లప్పుడు అభివృద్ధి కొరకు పోరాడుతుందని, పేదల పక్షాన ఉండే పార్టీ అని ఆయన తెలిపారు. 3వ వార్డులో పోటీలో ఉన్న అభ్యర్థి అహ్మద్ కసాదినిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. కార్యక్రమంలో పలువురు ఎంఐఎం పార్టీనేతలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: కేంద్రం చేసింది గుండు సున్నా: కేటీఆర్