ETV Bharat / state

ఈతకు వెళ్లి.. తిరిగిరాని లోకాలకు చేరాడు - hyderabad latest news

నలుగురు కలిసి ఈతకు వెళ్లారు.. అందులో ఓ యువకుడు తిరిగి రాలేదు.. లోతుకు వెళ్లి మునిగిపోయాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా జల్​పల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

Go swimming and died at jalpallu late at rangareddy
ఈతకు వెళ్లి.. తిరిగిరాని లోకాలకు చేరాడు
author img

By

Published : Mar 16, 2020, 7:05 PM IST

హైదరాబాద్ శివారు పహాడి షరీఫ్ పోలీస్​ స్టేషన్ పరిధిలోని జల్​పల్లి గ్రామ చెరువులో ఈతకు వెళ్లిన ఓ యువకుడు మృతి చెందాడు. ధూల్​పేట్ గంగాభౌలికి చెందిన 22 ఏళ్ల పవన్ సింగ్ మరో ముగ్గురితో కలిసి నిన్న సాయంత్రం జల్​పల్లి చెరువుకు చేరి ఈతకొట్టారు. ఆ సందర్భంలో పవన్​సింగ్ లోతుకు వెళ్లి నీటిలో మునిగిపోయాడు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు గజ ఈతగాళ్లను రప్పించి మృతదేహాన్ని బయటకు తీసి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని గోషామహల్‌ కార్పొరేటర్ ముఖేేశ్ సింగ్ సందర్శించి మృతుడి బంధువులను ఓదార్చారు.

ఈతకు వెళ్లి.. తిరిగిరాని లోకాలకు చేరాడు

ఇదీ చూడండి : తెలుగు రాష్ట్రాల విద్యుత్‌ సంస్థల్లో మళ్లీ లొల్లి

హైదరాబాద్ శివారు పహాడి షరీఫ్ పోలీస్​ స్టేషన్ పరిధిలోని జల్​పల్లి గ్రామ చెరువులో ఈతకు వెళ్లిన ఓ యువకుడు మృతి చెందాడు. ధూల్​పేట్ గంగాభౌలికి చెందిన 22 ఏళ్ల పవన్ సింగ్ మరో ముగ్గురితో కలిసి నిన్న సాయంత్రం జల్​పల్లి చెరువుకు చేరి ఈతకొట్టారు. ఆ సందర్భంలో పవన్​సింగ్ లోతుకు వెళ్లి నీటిలో మునిగిపోయాడు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు గజ ఈతగాళ్లను రప్పించి మృతదేహాన్ని బయటకు తీసి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని గోషామహల్‌ కార్పొరేటర్ ముఖేేశ్ సింగ్ సందర్శించి మృతుడి బంధువులను ఓదార్చారు.

ఈతకు వెళ్లి.. తిరిగిరాని లోకాలకు చేరాడు

ఇదీ చూడండి : తెలుగు రాష్ట్రాల విద్యుత్‌ సంస్థల్లో మళ్లీ లొల్లి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.