వారంతా పొట్ట చేత పట్టుకుని చత్తీస్గఢ్ నుంచి హైదరాబాద్కు వలస వచ్చారు. నగరంలోని మణికొండలో భవన నిర్మాణ రంగంలో కూలీలుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో వారికి ఉపాధి లేక పస్తులుంటున్నారు. గమనించిన ఈటీవీ భారత్ ప్రతినిధి వారిని పలకరించారు.
వారి సమస్యలు విని వెంటనే వారి దీనావస్థను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ దృష్టికి తీసుకెళ్లారు ఈటీవీ భారత్ ప్రతినిధి. స్పందించిన మంత్రి హరీశ్.. మణికొండ పురపాలిక మెుదటి వార్డు కౌన్సిలర్ వల్లభనేని అనిల్కు విషయం ఫోన్లో చెప్పారు. స్థానికంగా ఉన్న అనిల్ వెంటనే స్పందించి బాధితులకు బియ్యం, పప్పు, డబ్బులు పంపిణీ చేశారు.
మంత్రి హరీశ్ కృషి భేష్...
సమాచారాన్ని అందుకున్న వెంటనే స్పందించిన మంత్రి హారీశ్కు అనిల్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం బాధితులకు సామగ్రి సమకూర్చడంలో సహకరించిన బిల్డర్ శ్రీనివాస్కు కృతజ్ఞతలు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎవరూ ఆకలి బారిన పడకూడదనే తాము సరకులు పంపిణీ చేసినట్లు కౌన్సిలర్ అనిల్ పేర్కొన్నారు.
ఇవీ చూడండి : లాక్డౌన్ను ఉల్లంఘిస్తే 14రోజులు క్వారంటైన్: కేంద్రం