రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్పల్లి సమీపంలో ఓ ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం చోటుచేసుకొంది. అక్కడకు సమీపంలోనే పెట్రోల్ బంక్ ఉండడం వల్ల స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక, పోలీస్ అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు.
సుమారు రెండు గంటలపాటు శ్రమించి మంటలను అదుపుచేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రాజేంద్రనగర్ ఏసీపీ అశోక చక్రవర్తి తెలిపారు.
ఇవీచూడండి: వలస బాధితులకు ఆశ్రయంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్