రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలో ఓ వ్యక్తి కన్న బిడ్డపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సొంత కూతురిపై అఘాయిత్యానికి పాల్పడి రాత్రికి రాత్రే పరారయ్యాడు. విషయం తెలుసుకున్న తల్లి, కుమార్తెతో కలిసి షాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ కీచకుడి కోసం గాలిస్తున్నారు.
- ఇదీ చూడండి : ఏడాది పాపను కాటేసిన నాగుపాము