రంగారెడ్డి జిల్లా చీరాలలో ఎంపీ, జడ్పీ ఛైర్మన్, జడ్పీటీసీ, ఎంపీటీసీలకు తెరాస నాయకులు సన్మాన సభ ఏర్పాటు చేశారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, రంగారెడ్డి జడ్పీఛైర్పర్సన్ అనితరెడ్డి, జడ్పీటీసీలు, ఎంపీటీసీలను ఎమ్మెల్యే కాలె యాదయ్య సన్మానించారు. 84 గ్రామాలను తీవ్రంగా వేధిస్తున్న జీవో త్రిబుల్ వన్ ఎత్తివేసేందుకు సర్పంచులు తీర్మానాలు చేసి పత్రాలు ఇవ్వాలని ఎంపీ రంజిత్ రెడ్డి కోరారు. వాటిని సుప్రీంకోర్టుకు సమర్పిస్తామని చెప్పారు. జీవో త్రిబుల్ వన్పై కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వివరించారు.
ఇవీ చూడండి: బావిలో పడిన చిరుతను ఇలా కాపాడారు...