రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీలోని 3,4, 27 వార్డులలో కమిషనర్ జీపీ కుమార్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. డ్రైనేజీ, పారిశుధ్య పనులను పరిశీలించారు. పనుల్లో నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టర్కు నోటీసీలు ఇచ్చి... మరొకరితో పనులు పూర్తి చేస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు.
స్థానిక సమస్యలపై అధ్యాయనం చేసి త్వరలోనే అన్ని పరిష్కరిస్తామని జీపీ కుమార్ తెలిపారు. తూర్ కాలనీలో పర్యటించిన ఆయన అక్కడి డ్రైనేజీ పైప్ లైన్ పనులను అతి తొందరలో పూర్తి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్తో పాటు కౌన్సిలర్లు, స్థానిక నేతలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: చలి తీవ్రత తగ్గుతోంది.. గాలిలో తేమ పెరుగుతోంది!