రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ సమీపంలోని వంతెన వద్ద ప్రమాదవశాత్తు... 2 లారీల మధ్య ఓ కారు ఇరుక్కుపోయింది. రోడ్డు మధ్యలో నిలిచిపోవటం వల్ల హైదరాబాద్ వైపు వచ్చే మార్గంలో వాహనాలకు దారి లేక భారీ ఎత్తున నిలిచిపోయాయి. నీది తప్పంటే... నీది తప్పు అంటూ లారీ, కారు డ్రైవర్లు వాగ్వాదానికి దిగారు.
ఫలితంగా సుమారు 2 కి.మీ. మేర వాహనాలు నిలిపోయాయి. ప్రయాణికులు ఎండలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కారుకు ఎలాంటి నష్టం కలగకుండా లారీలను తప్పించే ప్రయత్నం చేశారు.