ETV Bharat / state

వైద్యుని నిర్లక్ష్యం.. చికిత్స అందక బాలుడి మరణం

సైకిల్​ మీద నుంచి పడిన బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు... తీవ్రంగా గాయపడిన పిల్లాడిని చూసి డాక్టర్ వెంటనే ఆపరేషన్ చేయాలన్నాడు. తీరా చికిత్స మొదలుపెట్టాల్సిన సమయంలో వేరే డాక్టర్ ఎవరూ లేరంటూ... కింద ఫోర్లులో డెలివరీ చేయాలని వెళ్లిపోయాడు. చికిత్సకోసం నిన్న రాత్రి నుంచి ప్రాణాలతో పోరాడిన ఆ చిన్నారి ఉదయం 7.30కి ప్రాణాలు వదిలేశాడు.

author img

By

Published : Apr 9, 2019, 3:14 PM IST

వైద్యుడి నిర్లక్ష్యంతో ప్రాణాలు వదిలిన బాలుడు

వైద్యుల నిర్లక్ష్యం... ఆసుపత్రిలో డాక్టర్లని అందుబాటులో ఉంచని అధికారుల వైఖరి.. ఏదైతేనేం... ఓ పిల్లాడి ప్రాణాలు గాల్లో కలిసిపోవడానికి కారణమయ్యాయి. రంగారెడ్డి జిల్లా కొలుకులపల్లి గ్రామానికి చెందిన 12 ఏళ్ల శివ సైకిల్ మీద నుంచి కిందపడి తీవ్ర గాయలపాలయ్యాడు. కుటుంబసభ్యులు వెంటనే నాంపల్లిలోని నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు.

రక్తం తెచ్చిపెట్టుకున్నారు
రాత్రి 12 గంటలకు బాలుడిని పరిక్షించిన వైద్యులు ఆపరేషన్ చెయ్యాలని చెప్పారు. చికిత్స కోసం రక్తం అవసరమంటే బ్లడ్ బ్యాంక్ నుంచి రక్తం కూడా తీసుకొచ్చారు బంధువులు. అంతా సిద్ధమనుకున్న సమయంలో కింద వార్డులో గర్భిణీకి డెలివరీ చెయ్యాలని డాక్టర్ వెళ్లిపోయారు. అందుబాటులో వేరే వైద్యుడు కూడా లేక... పరిస్థితి విషమించి ఈరోజు ఉదయం ఏడున్నరకు ఆ బాలుడు మృతి చెందాడు.

బంధువుల ఆందోళన

వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి శివ ప్రాణాలు తీసేశారంటూ బంధువులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. బాధ్యుడైన వైద్యునిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసుల భద్రత మధ్య ఆసుపత్రి సిబ్బంది మృత దేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియాకు తరలించారు.

వైద్యుడి నిర్లక్ష్యంతో ప్రాణాలు వదిలిన బాలుడు

ఇవీ చూడండి: పోలీసులకు చిక్కిన రూ.8 కోట్లు కమలానివే...!

వైద్యుల నిర్లక్ష్యం... ఆసుపత్రిలో డాక్టర్లని అందుబాటులో ఉంచని అధికారుల వైఖరి.. ఏదైతేనేం... ఓ పిల్లాడి ప్రాణాలు గాల్లో కలిసిపోవడానికి కారణమయ్యాయి. రంగారెడ్డి జిల్లా కొలుకులపల్లి గ్రామానికి చెందిన 12 ఏళ్ల శివ సైకిల్ మీద నుంచి కిందపడి తీవ్ర గాయలపాలయ్యాడు. కుటుంబసభ్యులు వెంటనే నాంపల్లిలోని నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు.

రక్తం తెచ్చిపెట్టుకున్నారు
రాత్రి 12 గంటలకు బాలుడిని పరిక్షించిన వైద్యులు ఆపరేషన్ చెయ్యాలని చెప్పారు. చికిత్స కోసం రక్తం అవసరమంటే బ్లడ్ బ్యాంక్ నుంచి రక్తం కూడా తీసుకొచ్చారు బంధువులు. అంతా సిద్ధమనుకున్న సమయంలో కింద వార్డులో గర్భిణీకి డెలివరీ చెయ్యాలని డాక్టర్ వెళ్లిపోయారు. అందుబాటులో వేరే వైద్యుడు కూడా లేక... పరిస్థితి విషమించి ఈరోజు ఉదయం ఏడున్నరకు ఆ బాలుడు మృతి చెందాడు.

బంధువుల ఆందోళన

వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి శివ ప్రాణాలు తీసేశారంటూ బంధువులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. బాధ్యుడైన వైద్యునిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసుల భద్రత మధ్య ఆసుపత్రి సిబ్బంది మృత దేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియాకు తరలించారు.

వైద్యుడి నిర్లక్ష్యంతో ప్రాణాలు వదిలిన బాలుడు

ఇవీ చూడండి: పోలీసులకు చిక్కిన రూ.8 కోట్లు కమలానివే...!

Note: Script Ftp
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.