కొవిడ్ కేసులు తమ ప్రాంతంలో పెరుగుతున్నా ప్రజలు ఇష్టారీతిన బయట తిరుగుతున్నారని అత్తాపూర్ కార్పొరేటర్ విజయ జంగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. డివిజన్లో ఇప్పటికే 200కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని.. 12 మంది మరణించారని చెప్పారు. మేయర్ బొంతు రామ్మోహన్, స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్కి ఈ విషయం తెలిపామన్నారు. సీఎం కేసీఆర్, కేటీఆర్ను కూడా త్వరలో కలుస్తామని చెప్పారు. ఎవరూ బయటికి వెళ్లకుండా నియమం పాటించినట్లయితే ఈ కరోనా మహమ్మారి నుంచి తప్పించుకోవచ్చని ఆమె సూచించారు.
అత్తాపూర్ డివిజన్ ఆనుకుని ఉన్న జియాగూడ డివిజన్ నుంచి ఇక్కడికి రాకపోకలు కొనసాగుతున్నాయి. అందువల్లనే కరోనా కేసులు పెరుగుతున్నాయని అంటున్నారు. ప్రతిరోజు మున్సిపల్ అధికారులు బ్లీచింగ్, శానిటైజ్ పక్రియ చేసినప్పటికీ కరోనా మహమ్మారి విజృంభిస్తోందని తెలిపారు.
ఇదీ చూడండి : ఘట్కేసర్లో హత్యకు గురైన చిన్నారి ఆద్య తండ్రి ఆత్మహత్య