ETV Bharat / state

మంత్రి కేటీఆర్​ పర్యటనలో కానిస్టేబుల్​, మహిళా ఎస్సై మధ్య వాగ్వాదం

ఓ కానిస్టేబుల్‌, ఎస్సై మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ఓ మాజీ ప్రజాప్రతినిధి వాహనాన్ని అనుమతించే విషయంలో గొడవ తలెత్తింది. ఈ ఘటన మంత్రి కేటీఆర్ సిరిసిల్ల పర్యటనలో జరిగింది.

author img

By

Published : Jul 26, 2021, 7:23 PM IST

police issue in sircilla
ఓ కానిస్టేబుల్‌, ఎస్సై మధ్య స్వల్ప వాగ్వాదం

మంత్రి కేటీఆర్​ పర్యటనలో ఓ కానిస్టేబుల్​, మహిళా ఎస్సై మధ్య స్వల్వ వాగ్వాదం తలెత్తింది. బందోబస్తులో భాగంగా విధులు నిర్వహిస్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ మాజీ ప్రతినిధి వాహనాన్ని అనుమతించే విషయంపై ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

police issue in sircilla

మంత్రి కేటీఆర్​ సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రి పర్యటనకు వస్తుండగా అక్కడే గేటు ముందు వేములవాడకు చెందిన కానిస్టేబుల్‌ మహేందర్ విధుల్లో ఉన్నారు. అదే సమయంలో ముస్తాబాద్ మండలానికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి వాహనంలో వచ్చారు. అయితే ఆ వాహనాన్ని కానిస్టేబుల్​ మహేందర్​ లోపలికి అనుమతించలేదు. అక్కడే ఆసుపత్రి ఆవరణలో ఉన్న మహిళా ఎస్సై అపూర్వ రెడ్డి వాహనాన్ని పంపించాలని అతనికి సూచించారు. అయితే అందుకు నిరాకరించిన కానిస్టేబుల్​ డ్యూటీ ఇంఛార్జి రామచంద్రం చెబితేనే అనుతిస్తానని తెగేసి చెప్పారు. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. అయితే తన విధి నిర్వహణలో అంత నిక్కచ్చిగా మాట్లాడిన మహేందర్​ను​ మాస్కు ఎందుకు ధరించలేదని తోటి ఉద్యోగులు ప్రశ్నించారు.

ఇదీ చూడండి: KTR: 'ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు ప్రాధాన్యం ఇస్తున్నాం'

మంత్రి కేటీఆర్​ పర్యటనలో ఓ కానిస్టేబుల్​, మహిళా ఎస్సై మధ్య స్వల్వ వాగ్వాదం తలెత్తింది. బందోబస్తులో భాగంగా విధులు నిర్వహిస్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ మాజీ ప్రతినిధి వాహనాన్ని అనుమతించే విషయంపై ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

police issue in sircilla

మంత్రి కేటీఆర్​ సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రి పర్యటనకు వస్తుండగా అక్కడే గేటు ముందు వేములవాడకు చెందిన కానిస్టేబుల్‌ మహేందర్ విధుల్లో ఉన్నారు. అదే సమయంలో ముస్తాబాద్ మండలానికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి వాహనంలో వచ్చారు. అయితే ఆ వాహనాన్ని కానిస్టేబుల్​ మహేందర్​ లోపలికి అనుమతించలేదు. అక్కడే ఆసుపత్రి ఆవరణలో ఉన్న మహిళా ఎస్సై అపూర్వ రెడ్డి వాహనాన్ని పంపించాలని అతనికి సూచించారు. అయితే అందుకు నిరాకరించిన కానిస్టేబుల్​ డ్యూటీ ఇంఛార్జి రామచంద్రం చెబితేనే అనుతిస్తానని తెగేసి చెప్పారు. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. అయితే తన విధి నిర్వహణలో అంత నిక్కచ్చిగా మాట్లాడిన మహేందర్​ను​ మాస్కు ఎందుకు ధరించలేదని తోటి ఉద్యోగులు ప్రశ్నించారు.

ఇదీ చూడండి: KTR: 'ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు ప్రాధాన్యం ఇస్తున్నాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.