ETV Bharat / state

తిండి లేకే తిరిగి వెళ్తున్నాం!

author img

By

Published : May 15, 2020, 10:12 AM IST

ఇసుక బట్టీల్లో పనిచేసే వలస కూలీలు.. లాక్​డౌన్​తో ఉపాధి లేక ఊరి బాట పట్టారు.​ రవాణా సదుపాయం లేక కాలినడకనే స్వస్థలాలకు బయలుదేరారు.

Breaking News


రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ఇసుక బట్టీల్లో పని చేసే వలస కార్మికులు రెండ్రోజుల క్రితం ఒడిశాకు పయనమయ్యారు. కాలినడకన ఊరి బాట పట్టిన వీరికి ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్​లో గ్రామ సర్పంచ్​ భోజన వసతి కల్పించారు.

రెండ్రోజుల పాటు అక్కడే బస చేసిన కూలీలు తిరిగి స్వస్థలాలకు పయనమయ్యారు. సిరిసిల్ల పరిధిలోని పెద్దూరు పెట్రోల్​ బంక్​ వద్దకు చేరుకోగానే విషయం తెలుసుకున్న సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్​ వారికి భోజన సౌకర్యం కల్పించారు. రాత్రి అక్కడే బస చేసేలా ఏర్పాట్లు చేశారు.

ఇసుక బట్టీల యజమానులు తమకు భోజన వసతి కల్పించకపోవడం వల్లే సొంతూళ్లకు బయలుదేరుతున్నామని కూలీలు వాపోయారు.


రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ఇసుక బట్టీల్లో పని చేసే వలస కార్మికులు రెండ్రోజుల క్రితం ఒడిశాకు పయనమయ్యారు. కాలినడకన ఊరి బాట పట్టిన వీరికి ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్​లో గ్రామ సర్పంచ్​ భోజన వసతి కల్పించారు.

రెండ్రోజుల పాటు అక్కడే బస చేసిన కూలీలు తిరిగి స్వస్థలాలకు పయనమయ్యారు. సిరిసిల్ల పరిధిలోని పెద్దూరు పెట్రోల్​ బంక్​ వద్దకు చేరుకోగానే విషయం తెలుసుకున్న సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్​ వారికి భోజన సౌకర్యం కల్పించారు. రాత్రి అక్కడే బస చేసేలా ఏర్పాట్లు చేశారు.

ఇసుక బట్టీల యజమానులు తమకు భోజన వసతి కల్పించకపోవడం వల్లే సొంతూళ్లకు బయలుదేరుతున్నామని కూలీలు వాపోయారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.