భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని వేములవాడలో పలువురు నాయకులు తమ ఇళ్లల్లోనే ఆయనకు నివాళులు అర్పించారు. లాక్డౌన్ కారణంగా సామూహికంగా జయంతి కార్యక్రమాలు చేయకూడదని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. నేతలంతా వ్యక్తిగతంగా అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను నిర్వహించుకున్నారు. తమ కార్యాలయాలు, ఇళ్లల్లో అంబేడ్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలు వేసి స్మరించుకున్నారు.
ఇవీ చూడండి: కరోనా ఎఫెక్ట్: పసిబిడ్డకు 'శానిటైజర్'గా నామకరణం