ETV Bharat / state

పార్వతి బ్యారేజీలో చేపపిల్లల విడుదల - పార్వతి బ్యారేజీలో చేపపిల్లల విడుదల

పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామంలో నిర్మించిన పార్వతి బ్యారేజీలో సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా వంద శాతం రాయితీతో చేపపిల్లలను వదిలిపెట్టారు.

పార్వతి బ్యారేజీలో చేపపిల్లల విడుదల
author img

By

Published : Aug 21, 2019, 11:28 AM IST

సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా వంద శాతం రాయితీతో చేప పిల్లల సరఫరా కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామం వద్దనున్న పార్వతి బ్యారేజీలో చేపపిల్లలను వదిలిపెట్టారు. కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ గోదారమ్మకు పసుపు కుంకుమలు, పూలు సమర్పించారు. 2019-2020లో మొత్తం చెరువులు, రిజర్వాయర్లలో కోటి 86 లక్షల చేప పిల్లలు పంపిణీ చేయాలని అనుకుంటున్నారు. ఇందులో భాగంగా సుందిళ్ల ప్రాజెక్టులో 12 లక్షల చేపపిల్లలు, రెండు లక్షల రొయ్య పిల్లలను వదలనున్నారు. ముదిరాజ్ మత్స్యకారులకు ప్రమాద బీమా వస్తుందని ఛైర్మన్ అన్నారు. ముందు ముందు మత్స్యకారులు అమ్ముకోవడానికి మార్కెట్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని పేర్కొన్నారు.

పార్వతి బ్యారేజీలో చేపపిల్లల విడుదల

ఇదీ చదవండిః బ్యాడ్​బాయ్ జోరు... రికార్డుల హోరు..!

సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా వంద శాతం రాయితీతో చేప పిల్లల సరఫరా కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామం వద్దనున్న పార్వతి బ్యారేజీలో చేపపిల్లలను వదిలిపెట్టారు. కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ గోదారమ్మకు పసుపు కుంకుమలు, పూలు సమర్పించారు. 2019-2020లో మొత్తం చెరువులు, రిజర్వాయర్లలో కోటి 86 లక్షల చేప పిల్లలు పంపిణీ చేయాలని అనుకుంటున్నారు. ఇందులో భాగంగా సుందిళ్ల ప్రాజెక్టులో 12 లక్షల చేపపిల్లలు, రెండు లక్షల రొయ్య పిల్లలను వదలనున్నారు. ముదిరాజ్ మత్స్యకారులకు ప్రమాద బీమా వస్తుందని ఛైర్మన్ అన్నారు. ముందు ముందు మత్స్యకారులు అమ్ముకోవడానికి మార్కెట్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని పేర్కొన్నారు.

పార్వతి బ్యారేజీలో చేపపిల్లల విడుదల

ఇదీ చదవండిః బ్యాడ్​బాయ్ జోరు... రికార్డుల హోరు..!

Intro:
పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామం వద్ద నిర్మించిన పార్వతి బ్యారేజ్ లో చేపపిల్లలను వదిలిపెట్టారు.

సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా 100% రాయితీతో చేప పిల్లల సరఫరా కార్యక్రమంలో భాగంగా ఈరోజు పార్వతి బ్యారేజ్ సుందిళ్ళ జలాశయంలో చేప పిల్లలను వదిలి పెట్టారు.
ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి జిల్లా పరిషత్ చైర్మన్ గారు పాల్గొని గోదావరి అమ్మకు పసుపుకుంకుమలు పుష్పములు సమర్పించి అధికారులతో ముదిరాజ్ కులస్తుల తో కలిసి చేపపిల్లలను సుందిళ్ల జలాశయంలో వదిలిపెట్టారు.
అనంతరం పుట్ట మధుకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కెసిఆర్ పేద ప్రజల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారని వారి అభివృద్ధికి ఎంతో పాటు పడుతున్నారని అన్నారు. గోదావరి నదిపై ప్రాజెక్టులు నిర్మించి సంవత్సరమంతా గోదావరిలో నీరు నిల్వ ఉండేటట్టు చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుంది అని అన్నారు. ఎల్లకాలం గోదావరిలో నీరు ఉండడం వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతోమందికి ఉపాధి కలుగుతుందని అన్నారు. ఎల్లకాలం గోదావరిలో నీరు ఉండడం వల్ల మరియు ఈ ప్రాజెక్టులను సందర్శించడానికి పర్యాటకులు రావడం వల్ల పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెంది ఎంతోమందికి ఉపాధి కలుగుతుందని అన్నారు.
2019-20 సంవత్సరమునకు మొత్తం చెరువులు , కుంటలు రిజర్వాయర్లలో ఒక కోటి 86 లక్షల చేప పిల్లల పంపిణీ చేయాలని కార్యాచరణ చేయడం జరిగిందని అన్నారు. ఇందులో భాగంగా సుందిళ్ళ ప్రాజెక్టు లో 12 లక్షలు చేపపిల్లలను మరియు రెండు లక్షల రొయ్యల పిల్లలను వదలటం జరుగుతుందని అన్నారు. ముదిరాజ్ కులస్తులకు మత్స్యకారులకు అందరికీ ప్రమాద బీమా వర్తిస్తుందని, వారికి కి ప్రమాద భీమాను కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 6 లక్షల రూపాయలు అందిస్తాయని చెప్పారు. ముందు ముందు మత్స్యకారులు అమ్ముకోవడానికి మార్కెట్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందుతుందని చెప్పారు.


Body:యం.శివప్రసాద్, మంథని.


Conclusion:9440728281.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.