కేసీఆర్ ప్రభుత్వంతోనే సంపూర్ణ అభివృద్ధి జరుగుతుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని బసంత్ నగర్ ఎయిర్పోర్టు స్థలాన్ని ఆయన ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు.
రాష్ట్ర ప్రభుత్వం 6 విమానాశ్రయాలను ఏర్పాటు చేస్తోందని... వాటిలో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని బసంతనగర్ ఒకటని ఎమ్మెల్యే తెలిపారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ చెప్పినప్పుడు చాలా సంతోషపడ్డానని వెల్లడించారు. ఈ నిర్మాణంతో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు.
ఇదీ చూడండి: ఇంట్లోనే పాఠాలు నేర్చుకోవడం ఓ చక్కటి అవకాశం: గవర్నర్