పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురంలోని పార్వతీ బ్యారేజీ వద్ద నీళ్లను నిలిపివేయగా.. ఆదివారం చేపల కోసం వేలాది మంది జలాశయం వద్దకు చేరుకున్నారు. అయితే సోమవారం అధికారులు బ్యారేజీ 25 గేట్లు ఎత్తివేసి నీటిని వదలగా.. ఉదయం మత్స్యకారుల తాకిడి కొంచెం తగ్గింది. అధికారులు మధ్యాహ్నానికి అన్ని గేట్లు మూసేసి ఏడు గేట్లు మాత్రమే తెరిచి ఉంచి నీటిని దిగువకు వదులుతున్నారు. అయినా కూడా జనం.. ప్రాణాలకు తెగించి నీటిలోకి దిగి చేపల కోసం వేట కొనసాగిస్తున్నారు.
సామాజిక దూరం పాటించకుండా మాస్కులు లేకుండా చేపల కోసం ఎగబడుతున్న జనాన్ని సామాజిక మాధ్యమాల్లో చూసిన నెటిజన్లు కామెంట్లతో దుమ్మెత్తి పోస్తున్నారు. ఇంత జరుగుతున్నా.. కొవిడ్ నిబంధన చర్యలు పాటించని వారిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.