ETV Bharat / state

బేగంపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

పెద్దపల్లి జిల్లా బేగంపేటలో రైతులు ఏర్పాటు చేసుకున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ దేవసేన ప్రారంభించారు. సొంత ఖర్చులతో ఏర్పాటు చేసుకున్న రైతులను కలెక్టర్ అభినందించారు.

author img

By

Published : Nov 20, 2019, 7:22 PM IST

బేగంపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ దేవసేన ప్రారంభించారు. సొంత ఖర్చులతో 5 ఎకరాల భూమిని చదును చేసుకొని ఐకేపీ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్న రైతులను కలెక్టర్ అభినందించారు. రైతులంతా కేంద్రానికి ఒకేసారి ధాన్యాన్ని తీసుకురావద్దని... రైతు సమన్వయ సమితి సభ్యులు, వ్యవసాయ అధికారులు కేటాయించిన షెడ్యూల్ ప్రకారమే రావాలని సూచించారు. తేమ శాతం 17 ఉంటేనే ధాన్యానికి మద్దతు ధర ఇచ్చేందుకు వీలుంటుందన్నారు. జిల్లాలో 215 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అవకతవకలు జరగకుండా విజిలెన్స్ అధికారులను నియమించినట్లు చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్మెన్​ పుట్ట మధుకర్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

బేగంపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ఇదీ చూడండి: ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై స్టే పొడిగింపు

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ దేవసేన ప్రారంభించారు. సొంత ఖర్చులతో 5 ఎకరాల భూమిని చదును చేసుకొని ఐకేపీ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్న రైతులను కలెక్టర్ అభినందించారు. రైతులంతా కేంద్రానికి ఒకేసారి ధాన్యాన్ని తీసుకురావద్దని... రైతు సమన్వయ సమితి సభ్యులు, వ్యవసాయ అధికారులు కేటాయించిన షెడ్యూల్ ప్రకారమే రావాలని సూచించారు. తేమ శాతం 17 ఉంటేనే ధాన్యానికి మద్దతు ధర ఇచ్చేందుకు వీలుంటుందన్నారు. జిల్లాలో 215 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అవకతవకలు జరగకుండా విజిలెన్స్ అధికారులను నియమించినట్లు చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్మెన్​ పుట్ట మధుకర్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

బేగంపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ఇదీ చూడండి: ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై స్టే పొడిగింపు

TG_KRN_105_20_IKP PRARAMBHAM_AVB_TS10125. M.SHIVAPRASAD, MANTHANI, 9440728281. పెద్దపెల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట గ్రామంలో ఐకెపి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. బేగంపేట గ్రామంలోని రైతులు స్వయంగా సొంత ఖర్చులతో 5 ఎకరాల భూమిని చదును చేసుకొని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా పాలనాధికారి శ్రీ దేవసేన, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీ దేవసేన ఈ కార్యక్రమానికి విచ్చేసి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రిబ్బన్ కట్ చేసి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించారు. ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించారు. అనంతరం దేవసేన మాట్లాడుతూ ముందుగా బేగంపేట రైతులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. సహకారం అంటే ఏమిటో ఐకెపి సెంటర్ ఏర్పాటు చేసుకున్న బేగంపేట రైతులు ఈరోజు నిరూపించారని అన్నారు. రైతుకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని అన్నారు. అందరు రైతులు ధాన్యాన్ని తీసుకొని ఒకేసారి కొనుగోలు కేంద్రానికి రావద్దని, ఎవరికి ఎప్పుడు అధికారులు నిర్వహిస్తారో అప్పుడే ధాన్యాన్ని తీసుకొని కొనుగోలు కేంద్రానికి రావాలని సూచించారు. 17 శాతం ప్రేమ ఉంటేనే రైతుల ధాన్యానికి మద్దతు ధర ఇచ్చేందుకు వీలుంటుందని అన్నారు. వ్యవసాయ అధికారులు, రైతు సమన్వయ సమితులు షెడ్యూల్ ప్రకారం ఎప్పుడు ఎవరు రావాలని నిర్ణయిస్తారని తెలిపారు. కాలేశ్వరం ప్రాజెక్ట్ మంచి వర్షాలు మరియు రైతుల చైతన్యం వల్ల ఈ సంవత్సరం అధికంగా ధాన్యం పంట సాగు చేశారని అన్నారు. జిల్లాలో 215 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాము. ప్రతి కేంద్రంలో అవకతవకలు జరగకుండా విజిలెన్స్ అధికారులు ఏర్పాటు చేశామని పాలనా అధికారి తెలిపారు. బైట్. శ్రీ దేవసేన పెద్దపెల్లి జిల్లా పాలనాధికారి.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.