పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగులో నిర్మించిన అన్నారం పంప్హౌస్లో ఇవాళ సాయంత్రం తొలిసారిగా 8 మోటార్లు ప్రారంభించారు. 23,200 క్యూసెక్కుల చొప్పున నీటిని పార్వతి బ్యారేజ్లోకి ఎత్తిపోస్తున్నారు. పార్వతి బ్యారేజ్ ప్రారంభించాక పూర్తి సామర్థ్యంలో నీటిని ఎత్తిపోయడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు నాలుగు మోటార్లనే వినియోగించారు. జలకళ సంతరించుకోవడం వల్ల అటుగా వెళ్తున్న ప్రయాణికులు పార్వతి బ్యారేజ్పై స్వీయచిత్రాలు దిగుతున్నారు. పరిసరాలన్నీ సందడిగా మారాయి.
ఇవీచూడండి: కాళేశ్వరంలో కేసీఆర్ విహంగ వీక్షణం