పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన కల్యాణలక్ష్మీ, సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చెక్కులను పంపిణీ చేశారు. 138 కల్యాణలక్ష్మీ చెక్కులు, 18 సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే శ్రీధర్ బాబు.. లబ్ధిదారులకు అందజేశారు. మంథని మండలంలో 78, ముత్తారం 23, రామగిరి 25, కమాన్పూర్ మండల పరిధిలోని 12 మందికి కల్యాణ లక్ష్మీ చెక్కులు అందికంచారు.
అనంతరం కరోనా తీవ్రత దృష్ట్యా ప్రజలకు మాస్కులు, ఫేస్ షీల్డులు ఎమ్మెల్యే అందజేశారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ కరోనా నివారణకు పాటుపడాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని చెప్పారు.
ఇదీ చదవండి: లక్షణాలు ఉన్నవారికి చికిత్స అందించండి: సత్యవతి రాఠోడ్