ETV Bharat / state

కొవిడ్​ మృతదేహాన్ని ప్యాక్ చేసిన ఆస్పత్రి సూపరింటెండెంట్ - ఆస్పత్రి సూపరింటెండెంట్​ వీడియో వైరల్​

కరోనా వైరస్ సోకిందన్న సమాచారం వింటే చాలు కుటుంబసభ్యులే దూరం పారిపోయే రోజులు ఇవి. ఇక కొవిడ్‌తో చనిపోతే మరీ దయనీయమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మృతదేహాన్ని తీసుకువెళ్లడానికే కాదు... తాకడానికి కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ ఆస్పత్రి సూపరింటెండెంటే... స్వయంగా కొవిడ్​ మృతదేహాలను ప్యాక్​ చేశారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఆస్పత్రిలో జరిగింది.

godavarikhani hospital superintendent packed covid patient dead body
godavarikhani hospital superintendent packed covid patient dead body
author img

By

Published : May 27, 2021, 12:03 PM IST

కొవిడ్​ మృతదేహాన్ని ప్యాక్ చేసిన ఆస్పత్రి సూపరింటెండెంట్

కరోనాతో ఎవరైనా చనిపోతే.. ఆ మృతదేహాలను అంత్యక్రియల కోసం ప్యాక్​ చేసి నగరపాలక సిబ్బందికి అప్పగించాలి. సాధారణంగా అయితే... మృతుల బంధువులకే పీపీఈ కిట్లు ఇచ్చి మృతదేహాలను ప్యాక్​ చేయిస్తుంటారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రాంతీయ అస్పత్రిలో కరోనాతో ఇద్దరు చనిపోయారు. వారి మృతదేహాలను ప్యాక్​ చేసేందుకు కుటుంబసభ్యులేవరూ ముందుకు రాలేదు. వార్డుబాయ్​లతో ఆ పని చేపించుదామనుకున్నా... వాళ్లు విధులకు రాలేదు.

ఇక ఆలస్యం చేయలేదు. ఎవరి నుంచి సాయం ఆశించలేదు. ఆ ఆస్పత్రి సూపరింటెండెంట్​ డాక్టర్​ శ్రీనివాస్​ రెడ్డి రంగంలోకి దిగారు. తానే స్వయంగా మృతదేహాలను ప్యాక్​ చేశాడు. ల్యాబ్​ టెక్నీషియన్​ శివ, సిబ్బంది సాయంతో ఈ ప్రక్రియ పూర్తి చేశారు. సూపరింటెండెంటే స్వయంగా ఈ ప్రక్రియలో పాల్గొనటం సిబ్బందిలో స్ఫూర్తి నింపింది. ప్రజలు కూడా ఆయన చేసిన పనిని అభినందిస్తున్నారు.

ఇదీ చూడండి: కరోనా బారినపడకుండా జాగ్రత్తగా ఉండటమే ఉత్తమం

కొవిడ్​ మృతదేహాన్ని ప్యాక్ చేసిన ఆస్పత్రి సూపరింటెండెంట్

కరోనాతో ఎవరైనా చనిపోతే.. ఆ మృతదేహాలను అంత్యక్రియల కోసం ప్యాక్​ చేసి నగరపాలక సిబ్బందికి అప్పగించాలి. సాధారణంగా అయితే... మృతుల బంధువులకే పీపీఈ కిట్లు ఇచ్చి మృతదేహాలను ప్యాక్​ చేయిస్తుంటారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రాంతీయ అస్పత్రిలో కరోనాతో ఇద్దరు చనిపోయారు. వారి మృతదేహాలను ప్యాక్​ చేసేందుకు కుటుంబసభ్యులేవరూ ముందుకు రాలేదు. వార్డుబాయ్​లతో ఆ పని చేపించుదామనుకున్నా... వాళ్లు విధులకు రాలేదు.

ఇక ఆలస్యం చేయలేదు. ఎవరి నుంచి సాయం ఆశించలేదు. ఆ ఆస్పత్రి సూపరింటెండెంట్​ డాక్టర్​ శ్రీనివాస్​ రెడ్డి రంగంలోకి దిగారు. తానే స్వయంగా మృతదేహాలను ప్యాక్​ చేశాడు. ల్యాబ్​ టెక్నీషియన్​ శివ, సిబ్బంది సాయంతో ఈ ప్రక్రియ పూర్తి చేశారు. సూపరింటెండెంటే స్వయంగా ఈ ప్రక్రియలో పాల్గొనటం సిబ్బందిలో స్ఫూర్తి నింపింది. ప్రజలు కూడా ఆయన చేసిన పనిని అభినందిస్తున్నారు.

ఇదీ చూడండి: కరోనా బారినపడకుండా జాగ్రత్తగా ఉండటమే ఉత్తమం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.