ETV Bharat / state

బురదమయంతో రామగుండం రహదారులు

పేరుకే రామగుండం నగరపాలక సంస్థ. అభివృద్ధిలో మాత్రం ఆమడ దూరం. కార్పొరేషన్లో వివిధ పన్నులు క్రమం తప్పకుండా వసూలు చేస్తారు.  ఇవ్వకుంటే నోటీసులతో పాటు ఇళ్లకు తాళాలు వేసే అంత వరకు వదిలిపెట్టరు. కానీ పట్టణాల్లోని రహదారులను మరమ్మతులు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. రామగుండం నగరపాలక ప్రాంతంలోని 50 డివిజన్​లో  దాదాపు రోడ్లన్నీ పొలాలను తలపిస్తున్నాయి.

author img

By

Published : Aug 13, 2019, 12:08 AM IST

బురదమయంతో రామగుండం రహదారులు
బురదమయంతో రామగుండం రహదారులు
పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని రోడ్లన్ని అధ్వానంగా తయారయ్యాయి. 50 డివిజన్లలో అభివృద్ధి పేరిట రోడ్లను తవ్వి.. డ్రైనేజీ పైపులైన్లతో పాటు తాగునీటి పైపులు వేసి నిర్లక్ష్యంగా వదిలేశారు. తవ్విన రోడ్లకు కనీసం తాత్కాలిక మరమ్మతులు కూడా చేయలేదు. ప్రధానంగా పారిశ్రామిక ప్రాంతంలో ఏదైనా ప్రమాదం జరిగితే అగ్ని మాపక వాహనం వెళ్లాలంటే బురదగుంటలో కూరుకుపోయే దుస్థితి నెలకొంది. అత్యవసర వాహనం వెళ్లే మార్గం కూడా గత రెండేళ్లుగా మరమ్మతులు చేయలేని పరిస్థితి. నగరపాలక సంస్థ వైపు ఒక రోడ్డు మినహా.. మార్కండేయ కాలనీ, చంద్రబాబు నాయుడు కాలనీ, శారద నగర్​ ప్రాంతాల్లో రహదారులన్నీ బురదతో నిండిపోయాయి. అధికారులకు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టకున్న లాభం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ కాలనీలో రహదారుల నిర్మాణానికి నిధులు కేటాయించినా.. పనులు ప్రారంభం కాలేదు.

పట్టణంలోని సప్తగిరి కాలనీ, శివనగర్​, అడ్డగుంట పల్లి తదితర కాలనీల్లో రోడ్లన్నీ దారుణంగా తయారై.. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు నానా తంటాలు పడాల్సి వస్తోంది. బురద గుంటలో బస్సులు, ఆటోలు పడి ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రామగుండం నగరపాలక సంస్థలోని ప్రధాన రోడ్లకు మరమ్మతులు చేసి.. ప్రజల ఇబ్బందులు తొలగించాలని కోరుతున్నారు.

ఇవీ చూడండి : అరకొర వసతులతో అంగన్​వాడీ కేంద్రాలు

బురదమయంతో రామగుండం రహదారులు
పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని రోడ్లన్ని అధ్వానంగా తయారయ్యాయి. 50 డివిజన్లలో అభివృద్ధి పేరిట రోడ్లను తవ్వి.. డ్రైనేజీ పైపులైన్లతో పాటు తాగునీటి పైపులు వేసి నిర్లక్ష్యంగా వదిలేశారు. తవ్విన రోడ్లకు కనీసం తాత్కాలిక మరమ్మతులు కూడా చేయలేదు. ప్రధానంగా పారిశ్రామిక ప్రాంతంలో ఏదైనా ప్రమాదం జరిగితే అగ్ని మాపక వాహనం వెళ్లాలంటే బురదగుంటలో కూరుకుపోయే దుస్థితి నెలకొంది. అత్యవసర వాహనం వెళ్లే మార్గం కూడా గత రెండేళ్లుగా మరమ్మతులు చేయలేని పరిస్థితి. నగరపాలక సంస్థ వైపు ఒక రోడ్డు మినహా.. మార్కండేయ కాలనీ, చంద్రబాబు నాయుడు కాలనీ, శారద నగర్​ ప్రాంతాల్లో రహదారులన్నీ బురదతో నిండిపోయాయి. అధికారులకు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టకున్న లాభం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ కాలనీలో రహదారుల నిర్మాణానికి నిధులు కేటాయించినా.. పనులు ప్రారంభం కాలేదు.

పట్టణంలోని సప్తగిరి కాలనీ, శివనగర్​, అడ్డగుంట పల్లి తదితర కాలనీల్లో రోడ్లన్నీ దారుణంగా తయారై.. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు నానా తంటాలు పడాల్సి వస్తోంది. బురద గుంటలో బస్సులు, ఆటోలు పడి ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రామగుండం నగరపాలక సంస్థలోని ప్రధాన రోడ్లకు మరమ్మతులు చేసి.. ప్రజల ఇబ్బందులు తొలగించాలని కోరుతున్నారు.

ఇవీ చూడండి : అరకొర వసతులతో అంగన్​వాడీ కేంద్రాలు

Intro:FILENAME: TG_KRN_33_09_NAGARA_MARGALU_ADVNAM_PKG_TS10039, GODAVARIKHANI,
PEDDAPALLI(DIST)9394450191.
యాంకర్: పేరుకే రామగుండం నగరపాలక సంస్థ అభివృద్ధిలో ఆమడ దూరం. కార్పొరేషన్లో వివిధ పన్నుల వసూళ్లు మాత్రం క్రమం తప్పకుండా వసూలు చేస్తూ ఇవ్వకుంటే నోటీసులతో పాటు ఇళ్లకు తాళాలు వేసే అంత వరకు వెళ్లి పన్నులు వసూలు చేస్తున్నారు కానీ పట్టణాల్లోని రహదారులు మరమ్మతులు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు రామగుండం నగరపాలక ప్రాంతంలోని 50 డివిజన్ లో దాదాపు రోడ్లన్నీ పొలాలను తలపిస్తున్నాయి ప్రజా ప్రతినిధులు గాని నగరపాలక అధికారులు కానీ పట్టించుకున్న పాపాన పోలేదు ఇప్పటికైనా నగరపాలక అధికారులు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని పట్టణ ప్రధాన కాలనీలో రోడ్లను మరమ్మతులు చేసి ఇ ప్రజలు ఇబ్బందులు తొలగించాలని వేడుకుంటున్నారు. రామగుండం నగరపాలక సంస్థ లో బురద రోడ్లను తలపిస్తున్న వైనంపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం..
వాయిస్ ఓవర్ పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థలో 50 డివిజన్లలో అభివృద్ధి పేరిట రోడ్లను తవ్వి డ్రైనేజీ పైపులైన్లు తో పాటు తాగునీటి పైపు లు వేసి రోడ్లో నిర్లక్ష్యంగా వదిలేశారు దీంతో తవ్విన రోడ్లకు మరమ్మతులు చేయకపోగా కనీసం తాత్కాలిక మరమ్మతులు కూడా చేయని పరిస్థితి నగరపాలక సంస్థ లో కనిపిస్తుంది ప్రధానంగా పారిశ్రామిక ప్రాంతంలో ఏదైనా ప్రమాదం జరిగితే అగ్నిమాపక కేంద్రం నుంచి అగ్ని మాపక వాహనం వెళ్లాలంటే బురదగుంటలో రోడ్లో లో వాహనం మట్టిలో కూరుకుపోయిన దుస్థితి నెలకొంది అయినా అధికారులకు ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్న గత రెండేళ్లుగా అత్యవసర వాహనం వెళ్లే మార్గం కూడా మరమ్మత్తులు చేయలేని పరిస్థితి . ప్రధానంగా నగరానికి కి నడిబొడ్డున ఉన్న మార్కండేయ కాలనీ లో రహదారులు కి అధ్వానంగా మారాయి మార్కండేయ శివాలయం నుంచి చంద్రబాబు నాయుడు కాలనీ శారద నగర్ ప్రాంతాల్లో అనేక రహదారులు ఉండగా నగరపాలక సంస్థ వైపు ఓకే రోడ్డు మినహా మిగతా రహదారులన్నీ బురద కు పంతో నిండిపోయాయి గోతుల మాయమైన మట్టి రోడ్లపై కనీసం ద్విచక్ర వాహనాలు సైతం వెళ్ల లేని దుస్థితి నెలకొంది మార్కండేయ కాలనీ లో అనేక రహదారుల పరిస్థితి ఇంతే నగరపాలక సంస్థ అత్యధికంగా ఎల్ఆర్ఎస్ ద్వారా ఆదాయాన్ని సమకూర్చిన ఈ కాలనీలో రహదారుల నిర్మాణానికి కొన్ని నిధులు కేటాయించినా పనులు ప్రారంభం కాలేదు మార్కండే కాలనీలోని శ్రీకృష్ణ మందిరానికి వెళ్లి ప్రధాన రహదారి దారుణంగా ఉంది మరో పక్షం రోజుల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఈ దేవాలయంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా రహదారి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు నగరపాలక ప్రత్యేక అధికారిగా ఉన్న జిల్లా పాలనాధికారి ప్రత్యేక శ్రద్ధ వహించి రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు అలాగే పట్టణంలోని సప్తగిరి కాలనీ నీ శివనగర్ అడ్డగుంట పల్లి మారుతీ నగర్ బస్టాండ్ ఏరియా విట్టల్ నగర్ తదితర కాలనీలలో రోడ్లన్నీ బురద మాయమై పాఠశాలకు వెళ్లే విద్యార్థులు నానా తంటాలు పడాల్సిన పరిస్థితి నెలకొంది పాఠశాలకు వెళ్లే బస్సులు ఆటోలు బురద గుంటలో పడి ప్రమాదాలకు గురయ్యే పరిస్థితుల్లో అయినా నగరపాలక అధికారులు రోడ్ల మరమ్మతు చేయడం లేదని పలువురు నగరపాలక అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులపై మండిపడుతున్నారు ఇప్పటికైనా రామగుండం నగరపాలక సంస్థ లోని ప్రధాన నగరాల్లో రోడ్లకు మరమ్మతులు చేసి ప్రజల ఇబ్బందులు తొలగించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.
బైట్: 1). మద్దెల దినేష్ ,ఏఐవైఎఫ్ నాయకులు గోదావరిఖని .
2). రమేశ్ కుమార్ స్థానికుడు గోదావరిఖని.


Body:ఘ్హ్జ్జ్


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.