శ్రావణ శుక్రవారం సందర్భంగా ఇందూరు జిల్లా వ్యాప్తంగా మహిళలు.. వరలక్ష్మీ వ్రతాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సుహాసినిలకు పసుపు బొట్లు ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకున్నారు.
అమ్మవారి ఆలయాల్లో వరలక్ష్మీ వ్రతం, రుద్రాభిషేకం, లక్ష్మీ హోమం నిర్వహించారు. కరోనా వ్యాప్తి వల్ల దేవాలయాల్లో తక్కువ సంఖ్యలో భక్తులు పూజల్లో పాల్గొన్నారు.