నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండలం నాలేశ్వర్కు చెందిన ఆటో డ్రైవర్ కొప్పిర్గ కిషన్ రూ.5,200 వ్యయంతో థర్మల్ స్క్రీనింగ్ పరికరాన్ని కొనుగోలు చేశారు. ఆయన వాహనంలో ప్రయాణించే వారు ముందుగా శానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకోవాలి.
తర్వాత స్క్రీనింగ్ పరీక్ష చేసి ఆరోగ్యం బాగున్నట్లు నిర్ధరించుకున్న తరువాతే వాహనంలో కూర్చోవాలని సూచిస్తున్నారు. కరోనా కట్టడిలో భాగంగా సామాజిక బాధ్యతగా ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నట్లు కిషన్ తెలిపారు.