దేశంలో బాండ్ పేపర్తో ప్రచారం చేసిన ఏకైక రాజకీయ నాయకుడు నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అని రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేశ్ రెడ్డి ఎద్దేవా చేశారు. పసుపు బోర్డుపై నకిలీ జీవో ప్రకటించారని ఆరోపించారు.
సహకార ఎన్నికల్లో రైతు బంధు, రుణమాఫీ అంశాలను తెరాస తెరపైకి తీసుకువస్తోందని అన్వేశ్ మండిపడ్డారు. రబీ సాగు డిసెంబర్లో ప్రారంభమైతే... ఇప్పుడు రైతు బంధు డబ్బును ఖాతాల్లో జమచేయడమేంటని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.
ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటినా... గుర్తుకు రాని రుణమాఫీ సహకార ఎన్నికల్లో గుర్తుకొచ్చిందా అని అన్వేశ్ రెడ్డి కేసీఆర్ సర్కార్ను ప్రశ్నించారు.
- ఇదీ చూడండి : ముఖ్యమంత్రి పుట్టినరోజుకు మొక్కలు నాటండి: కేటీఆర్