ETV Bharat / state

భగ్గుమంటున్న భానుడు... బావురుమంటున్న ప్రజలు..

రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. నేడు నిజామాబాద్​లో అత్యధికంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప...భానుడి భగభగకు భయపడి ప్రజలంతా బయటకు రావడం లేదు.

author img

By

Published : Apr 1, 2019, 7:40 PM IST

భగ్గుమంటున్న భానుడు... బావురుమంటున్న ప్రజలు..
భగ్గుమంటున్న భానుడు... బావురుమంటున్న ప్రజలు..
వేసవికాలం వచ్చేసింది. తొమ్మిది కాకముందే సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. భానుడి భగభగతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అధిక ఉష్ణోగ్రతలతో బయటకు అడుగు పెట్టాలంటేనే వణికిపోతున్నారు. తీవ్రమైన ఎండలకు తోడు వేడిగాలులు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నిజామాబాద్​లో దాదాపు 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుండటం వల్ల పట్టణ ప్రజలు జంకుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప మధ్యాహ్నం పూట ప్రజలు బయటకు రావడం లేదు.

ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. భానుడి ధాటికి ప్రయాణికులు తగ్గి మధ్యాహ్నం వేళల్లో బస్సులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.

ఇదీ చూడండి: 'మెదక్​తో మెజార్టీ విషయంలో పోటీ కష్టమే'

భగ్గుమంటున్న భానుడు... బావురుమంటున్న ప్రజలు..
వేసవికాలం వచ్చేసింది. తొమ్మిది కాకముందే సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. భానుడి భగభగతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అధిక ఉష్ణోగ్రతలతో బయటకు అడుగు పెట్టాలంటేనే వణికిపోతున్నారు. తీవ్రమైన ఎండలకు తోడు వేడిగాలులు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నిజామాబాద్​లో దాదాపు 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుండటం వల్ల పట్టణ ప్రజలు జంకుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప మధ్యాహ్నం పూట ప్రజలు బయటకు రావడం లేదు.

ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. భానుడి ధాటికి ప్రయాణికులు తగ్గి మధ్యాహ్నం వేళల్లో బస్సులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.

ఇదీ చూడండి: 'మెదక్​తో మెజార్టీ విషయంలో పోటీ కష్టమే'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.