ETV Bharat / state

శ్రీకాంతాచారి విగ్రహం ఆవిష్కరణ - శ్రీకాంతాచారి విగ్రహాన్ని ఆవిష్కరించిన బ్రహ్మ శ్రీ తల్లోజు ఆచారి

ఎందరో అమరువీరుల త్యాగాల ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని జాతీయ బీసీ కమిషనర్ సభ్యులు బ్రహ్మ శ్రీ తల్లోజు ఆచారి అన్నారు. నిజామాబాద్ నగరం హనుమాన్ జంక్షన్​లో శ్రీకాంతాచారి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

srikantachari-statue-unveiled-in-nizamabad-town
శ్రీకాంతా చారి విగ్రహం ఆవిష్కరణ
author img

By

Published : Aug 9, 2020, 8:18 PM IST

శ్రీకాంతాచారి చేసిన త్యాగాన్ని తెలంగాణ ప్రజలు ఎన్నడూ మరిచిపోరని జాతీయ బీసీ కమిషనర్ సభ్యులు బ్రహ్మ శ్రీ తల్లోజు ఆచారి అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎప్పుడూ సమసిపోతుందో ఆ రోజే అతని ఆత్మశాంతిస్తుందని పేర్కొన్నారు.

నిజామాబాద్ నగరంలోని హనుమాన్ జంక్షన్​లో ఆయన చేతుల మీదుగా శ్రీకాంతాచారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ మలిదశ ఉద్యమం దిశను శ్రీకాంతాచారి బలిదానం మార్చివేసింది అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్, జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాంతాచారి చేసిన త్యాగాన్ని తెలంగాణ ప్రజలు ఎన్నడూ మరిచిపోరని జాతీయ బీసీ కమిషనర్ సభ్యులు బ్రహ్మ శ్రీ తల్లోజు ఆచారి అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎప్పుడూ సమసిపోతుందో ఆ రోజే అతని ఆత్మశాంతిస్తుందని పేర్కొన్నారు.

నిజామాబాద్ నగరంలోని హనుమాన్ జంక్షన్​లో ఆయన చేతుల మీదుగా శ్రీకాంతాచారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ మలిదశ ఉద్యమం దిశను శ్రీకాంతాచారి బలిదానం మార్చివేసింది అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్, జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : మంజీర నీరే.. కానీ కాస్త నల్లగా, వాసన వస్తాయంతే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.