నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీలో ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మెప్మా ఉద్యోగులు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ స్వామి నాయక్ పాల్గొన్నారు. రేపటి నుంచి ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్ని వినియోగించకూడదని తెలిపారు. మున్సిపాలిటీ నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం మహిళలు ప్లాస్టిక్ నిషేధిస్తామంటూ పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు.
ఇవీ చూడండి: కాసేపట్లో మంత్రివర్గ సమావేశం... కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం