ETV Bharat / state

బోధన్​లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

author img

By

Published : Apr 30, 2021, 8:47 AM IST

బోధన్​ పట్టణంలో ఉపఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. కొవిడ్​-19 నిబంధనల మేరకు ఎన్నికల ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు.

tg-hyd-09-30-lady-suicide-av-ts10026_30042021074903_3004f_1619749143_355
బోధన్​లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో 18వ వార్డుకు ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం ఏడు నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. 2020లో తెరాస కౌన్సిలర్ చనిపోవడంతో నేడు ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు.

ఓటర్లు భౌతిక దూరం పాటించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఐదడుగుల దూరముండేలా సర్కిళ్లు వేశారు. మాస్కు ధరించి వస్తేనే పోలింగ్ కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. శానిటైజర్ స్టాండ్ ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుంది.

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో 18వ వార్డుకు ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం ఏడు నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. 2020లో తెరాస కౌన్సిలర్ చనిపోవడంతో నేడు ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు.

ఓటర్లు భౌతిక దూరం పాటించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఐదడుగుల దూరముండేలా సర్కిళ్లు వేశారు. మాస్కు ధరించి వస్తేనే పోలింగ్ కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. శానిటైజర్ స్టాండ్ ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుంది.

ఇదీ చూడండి: లైవ్​ అప్​డేట్స్​: రాష్ట్రంలో కొనసాగుతున్న మినీ పుర పోరు పోలింగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.