ETV Bharat / state

కార్మికులకు పాదరక్షలు పంపిణీ చేసిన నిజామాబాద్ మేయర్! - మేయర్ నీతూ కిరణ్

నిజామాబాద్ నగరపాలక సంస్థలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య సంరక్షణకు నగర మేయర్​ దండు నీతూ కిణ్ పాదరక్షలు పంపిణీ చేశారు. నగర పరిశుభ్రత కోసం రాత్రింబవళ్లు కష్ట పడుతున్న పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య సంరక్షణ మన బాధ్యత అని ఆమె అన్నారు.

Nizamabad Mayor Distributes Shoes For Municipality Labor
కార్మికులకు పాదరక్షలు పంపిణీ చేసిన నిజామాబాద్ మేయర్
author img

By

Published : Aug 25, 2020, 7:58 AM IST

నిజామాబాద్​ నగరపాలక సంస్థలో విధులు నిర్వహిస్తున్న పారిశుధ్ధ్య కార్మికుల ఆరోగ్య సంరక్షణ మనందరి బాధ్యత అని నిజామాబాద్​ నగర మేయర్​ దండు నీతూ కిరణ్​ అన్నారు. నగరంలోని మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలో ఆమె పారిశుద్ధ్య కార్మికులకు పాదరక్షలు పంపిణీ చేశారు. నగరం పరిశుభ్రంగా ఉండాలంటే పారిశుద్ధ్య కార్మికులు ఆరోగ్యంగా ఉండాలని.. పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య సంరక్షణే.. నగర పరిశుభ్రతకు నాంది అన్నారు. ప్రతి పట్టణవాసి తడి, పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు సహకరించాలని మేయర్ పిలుపునిచ్చారు. ఎవరికి వారు.. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే పారిశుద్ధ్య కార్మికులకు సగం భారం తప్పుతుందని ఆమె తెలిపారు.

నిజామాబాద్​ నగరపాలక సంస్థలో విధులు నిర్వహిస్తున్న పారిశుధ్ధ్య కార్మికుల ఆరోగ్య సంరక్షణ మనందరి బాధ్యత అని నిజామాబాద్​ నగర మేయర్​ దండు నీతూ కిరణ్​ అన్నారు. నగరంలోని మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలో ఆమె పారిశుద్ధ్య కార్మికులకు పాదరక్షలు పంపిణీ చేశారు. నగరం పరిశుభ్రంగా ఉండాలంటే పారిశుద్ధ్య కార్మికులు ఆరోగ్యంగా ఉండాలని.. పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య సంరక్షణే.. నగర పరిశుభ్రతకు నాంది అన్నారు. ప్రతి పట్టణవాసి తడి, పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు సహకరించాలని మేయర్ పిలుపునిచ్చారు. ఎవరికి వారు.. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే పారిశుద్ధ్య కార్మికులకు సగం భారం తప్పుతుందని ఆమె తెలిపారు.

ఇవీ చూడండి: దిల్లీలో ఐటీ మంత్రి కేటీఆర్.. కేంద్ర మంత్రి హర్​దీప్​సింగ్​ పూరీతో భేటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.