ETV Bharat / state

బస్సుయాత్రకు సిద్ధమైన పసుపు, ఎర్రజొన్న రైతులు

లోక్ సభ బరిలో నిలిచిన పసుపు, ఎర్రజొన్న రైతులు భవిష్యత్ కార్యాచరణపై దృష్టిపెట్టారు. ఆర్మూరులో సమావేశమైన కర్షకులు.. త్వరలో పోటీలో ఉన్న వారిలో ఒకరిని తమ నాయకునిగా ఎన్నుకోవాలని తీర్మానించారు.

author img

By

Published : Mar 30, 2019, 6:22 PM IST

పసుపు, ఎర్రజొన్న రైతులు
రైతును గెలిపించాలని నిజామాబాద్​ కర్షకుల వినతి
నిజామాబాద్​ లోక్​సభ ఎన్నికల బరిలో ఉన్న పసుపు, ఎర్రజొన్న రైతులు ఆర్మూర్​లో సమావేశమయ్యారు. తమ భవిష్యత్​ కార్యాచరణ ప్రకటించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ అన్ని గ్రామాల్లో బస్సు యాత్ర చేపట్టాలని,బూత్​ కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఏప్రిల్​ 8 లేదా 9న ఆర్మూరులో బహిరంగ సభ నిర్వహించి పోటీలో ఉన్న వారిలో ఒకరిని తమ నేతగా ఎన్నుకొని అతనికే ఓటెయ్యాలని అభ్యర్థించనున్నారు.

రైతునుగెలిపించండి

పార్లమెంటులో రైతులకు రిజర్వేషన్లు కల్పించాలని కర్షకులుడిమాండ్​ చేశారు. రైతును విస్మరిస్తే రాజకీయ పార్టీలకు ఎలాంటి గతి పడుతుందో తెలియచెప్పాలని రైతు నాయకుడు అన్వేష్​రెడ్డి తెలిపారు. గ్రామాల్లో ప్రజలు తాము బలపరిచిన అభ్యర్థులను గెలిపించి అన్నదాతను గెలిపించాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి :'పట్టాదారు పాసు పుస్తకాలిస్తేనే... ఓట్లేస్తాం'

రైతును గెలిపించాలని నిజామాబాద్​ కర్షకుల వినతి
నిజామాబాద్​ లోక్​సభ ఎన్నికల బరిలో ఉన్న పసుపు, ఎర్రజొన్న రైతులు ఆర్మూర్​లో సమావేశమయ్యారు. తమ భవిష్యత్​ కార్యాచరణ ప్రకటించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ అన్ని గ్రామాల్లో బస్సు యాత్ర చేపట్టాలని,బూత్​ కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఏప్రిల్​ 8 లేదా 9న ఆర్మూరులో బహిరంగ సభ నిర్వహించి పోటీలో ఉన్న వారిలో ఒకరిని తమ నేతగా ఎన్నుకొని అతనికే ఓటెయ్యాలని అభ్యర్థించనున్నారు.

రైతునుగెలిపించండి

పార్లమెంటులో రైతులకు రిజర్వేషన్లు కల్పించాలని కర్షకులుడిమాండ్​ చేశారు. రైతును విస్మరిస్తే రాజకీయ పార్టీలకు ఎలాంటి గతి పడుతుందో తెలియచెప్పాలని రైతు నాయకుడు అన్వేష్​రెడ్డి తెలిపారు. గ్రామాల్లో ప్రజలు తాము బలపరిచిన అభ్యర్థులను గెలిపించి అన్నదాతను గెలిపించాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి :'పట్టాదారు పాసు పుస్తకాలిస్తేనే... ఓట్లేస్తాం'

Intro:


నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణం క్షత్రియ ఫంక్షన్ హాల్లో లోక్ సభ బరిలో ఉన్న రైతులు సమావేశమయ్యారు .. ఏడు నియోజకవర్గాల చెందిన కర్షకులు ఎన్నికల బరిలో ఉన్న పసుపు ఎర్రజొన్న రైతులు తమ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు...


Body:బైట్
1) తిరుపతి ఎంపీ అభ్యర్థి జగిత్యాల జిల్లా .
2)సంజీవ్ రెడ్డి ఎంపీ అభ్యర్థి ఆర్ముర్.
3)అన్వేష్ రెడ్డి రైతు నాయకుడు.


Conclusion:
ఎన్నికల ప్రచారంలో అన్ని గ్రామాల్లో కి బస్సు యాత్రను చేపట్టి తెరాస ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ వెళ్లాలని నిర్ణయించుకున్నారు వచ్చేనెల 8 వ తారీఖున లేదా 9 వ తారీఖున ఆర్మూరు లో బహిరంగ సభ నిర్వహించి తమ పార్లమెంటు అభ్యర్థిని ప్రకటిస్తామని ఎంపీ అభ్యర్థులు తెలిపారు..బలపరిచిన అభ్యర్థికే ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.