ETV Bharat / state

విధుల్లో నిర్లక్ష్యం... గ్రామకార్యదర్శి సస్పెన్షన్

author img

By

Published : Jan 9, 2020, 1:15 PM IST

నిజామాబాద్​ జిల్లా సిరికొండ మండలం పొత్నూర్​లో పర్యటించిన కలెక్టర్​ నారాయణరెడ్డి... గ్రామంలో పారిశుద్ధ్య పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన గ్రామ కార్యదర్శి, క్షేత్రస్థాయి సహాయకుడిని తొలగించాలని అధికారులను ఆదేశించారు.

nizamabad collector narayanareddy
పొత్నూర్​లో కలెక్టర్​ ఆకస్మిక తనిఖీ
పొత్నూర్​లో కలెక్టర్​ ఆకస్మిక తనిఖీ

నిజామాబాద్​ జిల్లా కలెక్టర్​ నారాయణరెడ్డి సిరికొండ మండలంలోని పొత్నూర్​లో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వీధుల్లో తిరుగుతూ పారిశుద్ధ్య పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

రోడ్లపై చెత్తను తొలగించ లేదని, కొత్తగా మొక్కలు నాటలేదని సర్పంచ్, అధికారులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమం అమలు జరిగినట్లు కనిపించడం లేదని మండిపడ్డారు.

విధుల్లో నిర్లక్ష్యం వహించిన గ్రామ కార్యదర్శి గంగాధర్, క్షేత్ర సహాయకుడు నవీన్​ను సస్పెండ్​ చేయాలని అధికారులను ఆదేశించారు.

పొత్నూర్​లో కలెక్టర్​ ఆకస్మిక తనిఖీ

నిజామాబాద్​ జిల్లా కలెక్టర్​ నారాయణరెడ్డి సిరికొండ మండలంలోని పొత్నూర్​లో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వీధుల్లో తిరుగుతూ పారిశుద్ధ్య పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

రోడ్లపై చెత్తను తొలగించ లేదని, కొత్తగా మొక్కలు నాటలేదని సర్పంచ్, అధికారులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమం అమలు జరిగినట్లు కనిపించడం లేదని మండిపడ్డారు.

విధుల్లో నిర్లక్ష్యం వహించిన గ్రామ కార్యదర్శి గంగాధర్, క్షేత్ర సహాయకుడు నవీన్​ను సస్పెండ్​ చేయాలని అధికారులను ఆదేశించారు.

Tg_nzb_04_08_collector_thaniki_iddari_suspantion_av_ts10136 ******************************************** Rajendhar, etv contributer, indalvai () నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం లోని పెద్దవాల్గోట్, పొత్నూర్ గ్రామల్లో పల్లె ప్రగతి కార్యక్రమాలను బుధవారం జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ, ప్రభుత్వ పాఠశాల, గ్రామంలోని వీధుల లో పర్యటించారు. పల్లె ప్రగతికి సంబంధించి కార్యక్రమాలు నిర్వహించినట్లు గ్రామాన్ని పరిశీలిస్తే కనిపించడం లేదని రోడ్లకు ఇరువైపులా మురుగు నిండిన మురుగుకాల్వలు శుభ్రం చేయడం లేదని, రోడ్లపై చెత్తను తొలగించ లేదని, ఖాళీ స్థలాల్లో చెత్త పేరుకుపోయి ఉందని, కొత్తగా మొక్కలు నాట లేదని సర్పంచ్, అధికారులు, సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లె ప్రగతి ప్రారంభమై వారం రోజులైనా అందుకు సంబంధించిన పనులు ఏవి జరగలేదని అన్నారు. ఒక్క గ్రామపంచాయతీ, పాఠశాల మినహా ఇంకెక్కడ పారిశుద్ధ్య కార్యక్రమాలు జరగలేదన్నారు. పనుల్లో నిర్లక్ష్యం కారణంగా గ్రామ కార్యదర్శి గంగాధర్ ను సస్పెండ్ చేయవలసినదిగా జిల్లా పంచాయతీ అధికారికి, క్షేత్ర సహాయకుడు నవీన్ ను సస్పెండ్ చేయవలసినదిగా drdo ను ఆదేశించారు. అదేవిధంగా గ్రామ సర్పంచ్ గంగా దాస్ కు మెమో జారీ చేయవలసినదిగా DPOను ఆదేశించారు. గ్రామంలో మహిళలతో మాట్లాడుతూ పెన్షన్ వస్తుందా అని అడిగారు. రోజు ఎన్ని బీడీలు చేస్తారని ఎంత వస్తది అని మహిళలను అడిగి తెలుసుకున్నారు. బీడీ కట్టను పరిశీలించారు. పల్లె ప్రగతిపై మండల స్థాయి అధికారులు, ప్రత్యేక అధికారులతో రెగ్యులర్గా సెల్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నానని మరింత శ్రమించాలని అక్కడ ఉన్న డివిజనల్ పంచాయతీ అధికారి శ్రీకాంత్ ను, మండల ప్రజా పరిషత్ అధికారి శ్రీనివాస్ ని ఆదేశించారు. పోతునూరు గ్రామ సర్పంచ్, రెండు గ్రామాల ఎంపిఓ లక్ష్మీ ప్రసాద్ తో కూడా పారిశుద్ధ్య కార్యక్రమాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు...vis
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.