నిజామాబాద్ నగరాన్ని హైదరాబాద్కు దీటుగా అభివృద్ధి పరుస్తున్నామని ఎమ్మెల్యే గణేష్ గుప్తా అన్నారు. జిల్లా కేంద్రంలో అభివృద్ధి కళ్లు చెదిరేలా ఉండబోతోందని పేర్కొన్నారు. పట్టణ సుందరీకరణలో భాగంగా చేపడుతున్న పనులను పరిశీలించారు.
ఫులాంగ్ చౌరస్తా మధ్యలో ఏర్పాటు చేస్తున్న పామ్ ట్రీస్ ప్లాంటేషన్ గురించి అధికారులు, కాంట్రాక్టర్కు సూచనలు చేశారు. మాట ప్రకారం అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. నగరంలో ప్రధాన రోడ్లు, కూడళ్లు తళుక్కున మెరుస్తున్నాయన్నారు.
ఇదీ చూడండి: కేంద్రం సహాయం లేకుండా ఒక్క పథకం కూడా చేపట్టలేదు: కిషన్ రెడ్డి