ETV Bharat / state

కశ్మీర్ యాపిల్​ కంటే రుచి బాగుంది: ప్రశాంత్ రెడ్డి

నిజామాబాద్​ జిల్లా ముప్కాల్​ మండలం వెంచిర్యాల్​లో మంత్రి ప్రశాంత్​ రెడ్డి పర్యటించారు. గ్రామానికి చెందిన లింబారెడ్డి అనే రైతు సాగు చేస్తున్న యాపిల్​ తోటను పరిశీలించారు.

author img

By

Published : May 28, 2020, 8:10 PM IST

minister prashanth reddy visit apple garden in vencherial
కశ్మీర్ యాపిల్​ కంటే రుచి బాగుంది: ప్రశాంత్ రెడ్డి

నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం వెంచిర్యాల్​లో లింబారెడ్డి అనే రైతు సాగు చేస్తున్న యాపిల్​ సాగును... మంత్రి ప్రశాంత్​ రెడ్డి పరిశీలించారు. రుచిలో కశ్మీర్​ యాపిల్​కు ఏ మాత్రం తీసి పోలేదని మంత్రి అన్నారు. పంట దిగుబడిని బట్టి తాను కూడా సాగు చేస్తానని వ్యాఖ్యానించారు. రైతుకు మంచి లాభాలు రావాలని, పలువురికి ఆదర్శంగా నిలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

యాపిల్​ మొక్కలను హిమాచల్​ప్రదేశ్​ నుంచి హరిమాన్​-99 రకం తెచ్చి సాగు చేస్తున్నట్టు రైతు లింబారెడ్డి తెలిపారు. మూడు సంవత్సరాలకు పంట చేతికి వస్తుందని, ఇప్పటికి సంవత్సరంన్నర అవుతుందన్నారు. ఎలాంటి ప్రత్యేక సస్యరక్షణలు అవసరం లేకుండానే... మామూలు పద్ధతులతో సాగు చేయవచ్చని వివరించారు.

నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం వెంచిర్యాల్​లో లింబారెడ్డి అనే రైతు సాగు చేస్తున్న యాపిల్​ సాగును... మంత్రి ప్రశాంత్​ రెడ్డి పరిశీలించారు. రుచిలో కశ్మీర్​ యాపిల్​కు ఏ మాత్రం తీసి పోలేదని మంత్రి అన్నారు. పంట దిగుబడిని బట్టి తాను కూడా సాగు చేస్తానని వ్యాఖ్యానించారు. రైతుకు మంచి లాభాలు రావాలని, పలువురికి ఆదర్శంగా నిలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

యాపిల్​ మొక్కలను హిమాచల్​ప్రదేశ్​ నుంచి హరిమాన్​-99 రకం తెచ్చి సాగు చేస్తున్నట్టు రైతు లింబారెడ్డి తెలిపారు. మూడు సంవత్సరాలకు పంట చేతికి వస్తుందని, ఇప్పటికి సంవత్సరంన్నర అవుతుందన్నారు. ఎలాంటి ప్రత్యేక సస్యరక్షణలు అవసరం లేకుండానే... మామూలు పద్ధతులతో సాగు చేయవచ్చని వివరించారు.

ఇదీ చూడండి: కేటీఆర్​కు అరుదైన గౌరవం.. వర్చువల్ సదస్సుకు ఆహ్వానం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.